CM Jagan: ఈ దత్తపుత్రుడు అప్పుడెందుకు ప్రశ్నించలేదు ?: జగన్
మూడేళ్లలో రాష్ట్రంలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయని సీఎం జగన్ అన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 16లక్షల టన్నులు పెరిగిందని చెప్పారు. రైతులకు వడ్డీలేని
గణపవరం: మూడేళ్లలో రాష్ట్రంలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయని సీఎం జగన్ అన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 16లక్షల టన్నులు పెరిగిందని చెప్పారు. రైతులకు వడ్డీలేని రుణాల పథకం కింద రూ.1,282 కోట్లు అందజేశామన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు రూ.7లక్షల ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. వైఎస్సాఆర్ రైతుభరోసా కింద నిధుల విడుదల కార్యక్రమాన్ని ఇవాళ ఏలూరు జిల్లా గణపవరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.
ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించలేదు..
‘‘ఇటీవల చంద్రబాబు దత్తపుత్రుడు రైతుల పరామర్శకు బయలుదేరారు. సీసీఆర్సీ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం ఉండి ఆత్మహత్య చేసుకున్న ఏ ఒక్క రైతుకూ పరిహారం దక్కలేదని చూపలేకపోయారు. గత ప్రభుత్వంలో రైతులకు హామీలిచ్చి గాలికొదిలేశారు. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా.. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా.. చంద్రబాబు అంటే విపరీతమైన ప్రేమ చూపించాడీ దత్తపుత్రుడు. ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదని ఈ దత్తపుత్రుడిని అడుగుతున్నా.
రైతులపై మమకారం ఉండాలి
పంట సీజన్ ముగిసేలోగా ఆ పంట నష్టపరిహారం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. కృష్ణా, గోదావరి డెల్టాతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమకు అత్యధికంగా సాగునీటి ప్రాజెక్టులు, కాలువల ద్వారా నీరు ఇచ్చింది ఈ మూడు సంవత్సరాలలోనే. రైతులకు ఇలాంటి మేలు చేయాలంటే వ్యవసాయం మీద, మన సంస్కృతి మీద, రైతుల కష్టం మీద మమకారం, అవగాహన ఉండాలి. గత పాలకులకు ఇవేమీ లేవు.
వారిని అడుగుతున్నా..
సాగునీరు ప్రాంతంలో, మెట్ట ప్రాంతంలో ఉండే రైతుల కష్టాలపై అవగాహన లేని పరిపాలన గతంలో చూశాం. ఎన్నికల్లో రైతులకిచ్చిన మాట తప్పిన నాయకుడు రాజకీయాల్లో ఉండటానికి తగునా అని.. మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న వారిని అడుగుతున్నా’’ అని జగన్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు