CM Jagan: రైతులకు మంచి చేస్తున్నా విపక్షాలు ఓర్వలేకపోతున్నాయి: సీఎం జగన్
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న చుక్కల భూ సమస్యను పరిష్కరించామని సీఎం జగన్ తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన కార్యక్రమంలో చుక్కల భూముల రైతులకు సీఎం హక్కు పత్రాలు పంపిణీ చేశారు.
కావలి: దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించామని సీఎం జగన్ అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన కార్యక్రమంలో చుక్కల భూముల రైతులకు హక్కు పత్రాలను సీఎం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల్లో భూసర్వే చేయిస్తున్నామని.. 2 వేల గ్రామాల్లో భూహక్కు పత్రాల పంపిణీని వేగవంతం చేశామని చెప్పారు. రూ.20వేల కోట్ల విలువైన చుక్కల భూములకు సంపూర్ణ హక్కు కల్పిస్తున్నట్లు జగన్ వివరించారు.
‘‘17,476 రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటికే 2 వేల గ్రామాలకు సంబంధించి భూసర్వే నుంచి మొదలుపెట్టి హక్కు పత్రాలు అందించే వరకు అన్ని ఏర్పాట్లు చేశాం. సుమారు 7 లక్షలకుపైగా భూహక్కు పత్రాలను అన్ని రకాలుగా అప్డేట్ చేసి రైతులకు అందించాం. గ్రామాల్లోని భూములకు సరిహద్దు రాళ్లు పాతించాం. ఈ 2వేల గ్రామాలకు సంబంధించి ఈ నెల 20వ తేదీలోగా అన్ని పనులు పూర్తి చేస్తాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి 2వేల గ్రామాల చొప్పున భూహక్కు పత్రాలు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశాం.
ప్రతి అడుగులో కూడా రైతులకు మంచి జరగాలనే ఆలోచనతోనే ఇవన్నీ చేస్తున్నాం. రైతన్నకు తోడుగా ఉండేందుకు ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల నుంచి మొదలుపెడితే అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆర్బీకేల పరిధిలోనే ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే 21రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తున్నాం. రైతన్నల మనసు, వారి కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ నాలుగేళ్లలో రైతులకు అండగా ఉండేందుకే ప్రతి అడుగు వేశాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా అన్నదాతలకు మంచి చేస్తున్నాం.
ప్రతిపక్ష నేతల నాటకాలు నమ్మొద్దు..
రాష్ట్రంలోని రైతుల కోసం అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ విపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. అన్ని గ్రామాల్లో సర్వే చేసి సహరిద్దు రాళ్లు వేస్తున్నాం. లంచాల ప్రస్తావన లేకుండానే మీ ఖాతాల్లో నగదు పడుతోంది. ఇవాళ 97,471 మంది రైతుల కుటుంబాలకు మేలు చేశాం. రిజిస్ట్రేషన్ చట్టంలోని 22-ఎ తొలగించాం. రికార్డుల్లో మార్పు చేశాం. మాది రైతు ప్రభుత్వం.. వారికి మంచి చేయడమే మా విధానం. భవిష్యత్తులో వివాదాలు రాకుండా భూహక్కు పత్రాలు ఇస్తున్నాం. ప్రతిపక్ష నేతల నాటకాలు నమ్మొద్దని రైతులను కోరుతున్నా’’ అని జగన్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి. -
లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. -
రైతులను అప్పుల్లో ముంచిన జగన్
సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. -
మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సీఎం జగన్ అవినీతిపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం
ముఖ్యమంత్రి జగన్ అవినీతిపై ఛార్జ్షీట్ రూపొందిస్తామని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
‘నాడు-నేడు’ కార్యశాల పేరిట వైకాపా డప్పు
గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
నేడు నామినేషన్ వేయనున్న పురందేశ్వరి
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరం అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది. -
రాష్ట్రంలో నాలుగు చోట్ల మోదీ సభలు
ఎన్డీయే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో నాలుగు బహిరంగ సభలకు హాజరుకానున్నారు. -
అంబటి, అనిల్కుమార్లపై సీఈఓకు తెదేపా ఫిర్యాదు
ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీ కప్పులపై తమ బొమ్మలు ముద్రించి టీ స్టాళ్లకు పంపిణీ చేస్తున్న వైకాపా అభ్యర్థులు అంబటి రాంబాబు, అనిల్కుమార్లపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. -
పొన్నూరు వైకాపా అభ్యర్థిపై చర్యలకు ఆదేశం
గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. -
ఏపీలో తొలిరోజు 229 నామినేషన్లు
రాష్ట్రంలో తొలిరోజు లోక్సభ స్థానాలకు 39 నామినేషన్లు, శాసనసభ స్థానాలకు 190 నామినేషన్లు దాఖలయ్యాయి. -
21న తెదేపా అభ్యర్థులకు బి-ఫాంలు
తెదేపా అధినేత చంద్రబాబు ఈ నెల 21న పార్టీ అభ్యర్థులకు స్వయంగా బి-ఫాంలు అందజేయనున్నారు. -
పవన్ సమక్షంలో జనసేనలో చేరికలు
మాజీ మంత్రి దివంగత వట్టి వసంతకుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్కుమార్ సహా పలువురు నాయకులు గురువారం జనసేనలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే