CM Jagan: ఈనెల 27న వైకాపా ముఖ్యనేతలతో జగన్‌ కీలక భేటీ

రానున్న సాధారణ ఎన్నికలకు పార్టీ నేతలను సిద్ధం చేయడంపై వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్‌ దృష్టి సారించారు.

Published : 25 Apr 2022 02:24 IST

అమరావతి: రానున్న సాధారణ ఎన్నికలకు పార్టీ నేతలను సిద్ధం చేయడంపై వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్‌ దృష్టి సారించారు. ఇటీవల మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు, జిల్లాల పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మాజీ మంత్రులు, రీజినల్‌ కోఆర్డినేటర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈనెల 27న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కీలక భేటీ జరగనుంది.

ఆరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఆ సమావేశంలో పార్టీ పటిష్ఠత.. క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై జగన్‌ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రులు, పార్టీ అధ్యక్షులను సఖ్యతగా ఉంచడం.. తద్వారా పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయడమే లక్ష్యంగా ఈ భేటీ జరగనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని