AP NEWS: ప్రాణం విలువ నాకు తెలుసు: జగన్
రెండేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో ప్రతి కుటుంబాన్ని, ప్రాంతాన్ని, సామాజిక వర్గాన్నీ దృష్టిలో ఉంచుకుని అడుగులు ముందుకు వేశామని ఏపీ సీఎం
అమరావతి: రెండేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో ప్రతి కుటుంబాన్ని, ప్రాంతాన్ని, సామాజిక వర్గాన్నీ దృష్టిలో ఉంచుకుని అడుగులు ముందుకు వేశామని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేశామని చెప్పారు. బడ్జెట్ సమావేశంలో భాగంగా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చలో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో కొవిడ్ బారిన పడి మృతిచెందిన వారికి శాసనసభ సంతాపం తెలిపింది. సీఎం సహా సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా జగన్ వివరించారు.
ఆరోగ్యశ్రీలో సమూల మార్పులు తీసుకొచ్చాం
‘‘ప్రాణం విలువ నాకు బాగా తెలుసు. అందుకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీలో సమూల మార్పులు తీసుకొచ్చాం. ప్రాణం పోసే పథకంగా ఉండాలనే ఉద్దేశంతో రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్న ప్రతి కుటుంబానికీ ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు చేపట్టాం. 2019కి ముందు 1000 జబ్బులకు మాత్రమే అందులో అవకాశముండేది. ఇప్పుడు 2400 వ్యాధులను చేర్చాం. దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా 104, 108 వాహనాలను వైద్యపరికరాలతో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏఎన్ఎంను కూడా నియమించాం. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్ అందుబాటులోకి రానున్నాయి. అందులోనే 90 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. ప్రతి మండలానికి రెండు పీహెచ్సీలు.. ఒక్కో పీహెచ్సీకి ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.
18వేలకు పైగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల కొనుగోలు
ప్రపంచానికి కొవిడ్ పెద్ద సవాలు విసురుతోంది. రాష్ట్రంలో గత ఏడాది మార్చిలో తొలి కేసు నమోదైంది. గతంలో కరోనా పరీక్షల ఫలితాలకు నమూనాలను పుణె పంపాల్సి వచ్చేది. ఇప్పుడు రాష్ట్రంలో 150కి పైగా ల్యాబ్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. రాష్ట్రంలో రోజూ లక్షకు పైగా పరీక్షలు చేస్తున్నాం. కొవిడ్ ఫస్ట్ వేవ్లో 261 ఆస్పత్రుల్లో.. ఇప్పుడు 649 ఆస్పత్రుల్లో సేవలందిస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి మహానగరం లేకుండా పోయింది. దీంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కూడా కరవయ్యాయి. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను గ్రహించి వైద్య రంగాన్ని పటిష్ఠం చేసేందుకు చర్యలు చేపట్టాం. ‘నాడు- నేడు’ కింద ఆస్పత్రుల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టీచింగ్, నర్సింగ్ కళాశాల పెట్టే ఆలోచన ఉంది. గత సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలో కరోనా రోగుల కోసం 37,400 బెడ్లు ఉంటే.. ఇప్పుడు 47,285 బెడ్లు అందుబాటులోకి తీసుకొచ్చాం. కొవిడ్ కేర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం. అక్కడ కూడా మెరుగైన వైద్య సేవలు అందేలా అందులో 52వేల పైచిలుకు బెడ్లు అందుబాటులో ఉంచాం. కొవిడ్ కేర్ సెంటర్లలో 18 వేలకుపైగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కొనుగోలుకు చర్యలు చేపట్టాం. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి ఉచితంగా వైద్యం అందిస్తున్న రాష్ట్రం ఏపీనే. రోజూ సుమారు 25వేల మంది ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్య సదుపాయాలు పొందుతున్నారు. కేవలం కొవిడ్పైనే ఈ 14 నెలల్లో రూ.2,229 కోట్లు ఖర్చు చేశాం. కొత్తగా బ్లాక్ ఫంగస్ను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ఈ వ్యాధి చికిత్స కోసం రాష్ట్రంలో 17 ఆస్పత్రులను నోటిఫై చేశాం.
వాళ్లందరికీ హ్యాట్సాఫ్
104కు ఫోన్ చేస్తే కొవిడ్కు సంబంధించి ఎలాంటి సహాయం కావాలన్నా చేసేలా చర్యలు చేపట్టాం. ఈనెల 16 నాటికి 104 కాల్ సెంటర్కు 3లక్షలకు పైగా కాల్స్ వచ్చాయి. వీరిలో 60,634 మందికి ఆస్పత్రుల్లో అడ్మిషన్లు ఇప్పించగలిగాం. కరోనా సోకి హోం ఐసోలేషన్లో ఉన్నవారికి తగు సూచనలు చేస్తున్నాం. 3,991 మంది వైద్యులు టెలీ మెడిసన్ ద్వారా సేవలు అందిస్తున్నారు. జిల్లాల్లో ఆక్సిజన్ మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేశాం. ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే స్పందించేలా చర్యలు చేపట్టాం. రోజుకి 4 నుంచి 6 ఖాళీ ట్యాంకర్లను విమానాల్లో ఒడిశా పంపి ఆక్సిజన్ తెస్తున్నాం. విదేశాల నుంచి క్రయోజెనిక్ ట్యాంకర్లు, ఆక్సిజన్ను షిప్లలో దిగుమతి చేసుకుంటున్నాం. ఆక్సిజన్ ఎక్కడ లభిస్తున్నా తెప్పించేందుకు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నాం. రాబోయే తరాలకు మంచి జరగాలనే ఉద్దేశంతో సీహెచ్సీ స్థాయి వరకు 53 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాం. గ్రామ స్థాయిలో ఉన్న ఆశా వర్కర్ల నుంచి డాక్టర్లు, శానిటేషన్ సిబ్బంది మొదలుకొని కలెక్టర్ల వరకు కష్టపడి పనిచేస్తున్నారు. అందుకే మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉంది. వాళ్లందరికీ హ్యాట్సాఫ్.
వాస్తవాలు తెలిసీ నిందలు..
రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారు 1.48 కోట్ల మంది ఉన్నారు. వాళ్లకి వ్యాక్సినేషన్ పూర్తి కావాలంటే 3 కోట్ల డోసులు అవసరం. 18-45 ఏళ్లలోపు ఉన్న 2 కోట్ల మందికి 4 కోట్ల డోసులు కావాలి. ఈ లెక్కన రాష్ట్రానికి మొత్తం 7 కోట్ల డోసులు అవసరముంది. కానీ ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చింది 76.29లక్షల డోసులు మాత్రమే. ఈ వాస్తవాలు తెలిసి కూడా కొందరు కావాలనే రాజకీయ నిందలు వేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. కమీషన్ల కోసం వ్యాక్సిన్ కొనడం లేదంటూ దుర్మార్గ ఆరోపణలు చేస్తున్నారు. ఇవి చూసినపుడు మనసుకు బాధ అనిపిస్తోంది. వ్యాక్సిన్ల కొనుగోలుపై గ్లోబల్ టెండర్లకు వెళ్తున్నాం. రాష్ట్ర జనాభాలో సుమారు 11 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ అయింది. 50 శాతం పూర్తిచేయగలిగితే కొద్దో గొప్పో హెర్డ్ ఇమ్యూనిటీ కనిపిస్తుంది. కొవిడ్ నుంచి బయటపడాలంటే వ్యాక్సినేషనే పరిష్కారం. అంతవరకు కరోనాతో కలిసి బతకాలనే నిజాన్ని అర్థం చేసుకోవాలి. 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ వేసేందుకు తొలి ప్రాధాన్యమిస్తాం. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మిగిలిన వారికీ ఉచితంగా వేస్తాం. ఆదాయం తగ్గుతున్నా ప్రాణం విలువ తెలుసు కాబట్టే తప్పులు జరిగే అవకాశం లేకుండా చిత్తశుద్ధితో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల మనోధైర్యం దెబ్బతీసేలా అసత్యాలు, అపోహల ప్రచారం చేయొద్దు. ప్రజల్లో భయాన్ని పుట్టించి ఆడే గుండెనూ ఆపేయకండి’’ అని జగన్ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి కాదా అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు. -
కాళేశ్వరం, కేసీఆర్పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు (7)
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్పై ఒంటరిగానే నా పోరాటం
‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారు. -
ఎమ్మెల్యే కాటసాని సోదరుడు చంద్రశేఖరరెడ్డితో తెదేపా మంతనాలు
నంద్యాల జిల్లా బనగానపల్లిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డితో గురువారం రాత్రి తెదేపా నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి మంతనాలు సాగించారు. -
‘సంగం’పై ఆర్వో ఎలా స్పందిస్తారు: ధూళిపాళ్ల
కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీపై వైకాపా నాయకుడు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు. -
గుంటూరు మిర్చియార్డులో వైకాపా అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా గుంటూరు లోక్సభ అభ్యర్థి, పలు శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈ నెల 22న గుంటూరు మిర్చియార్డులో ప్రచారం నిర్వహించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనాకు యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. -
వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. -
వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. -
శివసేన (శిందే)లో చేరిన నటుడు గోవిందా
సార్వత్రిక ఎన్నికల ముందు బాలీవుడ్ నటుడు గోవిందా (60) మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గురువారం ఆయన శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీ
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర పార్టీ ‘తెలంగాణ ప్రజల ముంగిట్లోకి జాతీయ మ్యానిఫెస్టో’ కమిటీని ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు