CM Kcr: కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాం: కేసీఆర్, శరద్ పవార్
కేంద్రంలోని భాజపా విధానాలకు వ్యతిరేకంగా పోరాటం ఆరంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాంతీయ పార్టీల అధినేతలతో భేటీ..
ముంబయి: కేంద్రంలోని భాజపా విధానాలకు వ్యతిరేకంగా పోరాటం ఆరంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాంతీయ పార్టీల అధినేతలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అంనతరం ఎన్సీపీ అధినేత నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలపై చర్చించిన అంనతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు సంతోష్, రంజిత్రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!