KCR-Amit Shah: అమిత్‌ షాతో సీఎం కేసీఆర్‌ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. శనివారం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఐపీఎస్‌ క్యాడర్‌ రివ్యూ, విభజన చట్టం

Updated : 04 Sep 2021 19:24 IST

దిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. శనివారం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఐపీఎస్‌ క్యాడర్‌ రివ్యూ, విభజన చట్టం హామీలపై చర్చించే అవకాశం ఉంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంపైనా ఆయన వద్ద ప్రస్తావించనున్నారు.

మరోవైపు, నిన్న  సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన కేసీఆర్‌.. తెలంగాణ అభివృద్ధికి బాసటగా నిలవాలని కోరారు. దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగిన ఈ కీలక భేటీలో పలు అంశాలపై 10 లేఖలను ప్రధానికి అందజేసిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని