BRS: భారాసకు అధికారమిస్తే.. జలవిధానం పూర్తిగా మార్చేస్తాం: కేసీఆర్
భారాసకు అధికారమిస్తే దేశంలో జలవిధానం పూర్తిగా మార్చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ఈమేరకు నాందేడ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నాందేడ్: చిన్న చిన్న దేశాలు కూడా అద్భుతంగా ప్రగతి సాధిస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) అన్నారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడమే భారాస(BRS) లక్ష్యమని పునరుద్ఘాటించారు. నాందేడ్ (Nanded)లో నిర్వహించిన భారాస బహిరంగ సభ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో ప్రజలకు సరిపడా సహజ వనరులు ఉన్నాయి. దేశంలో ఏటా 1.40 లక్షల టీఎంసీల మేర వర్షం కురుస్తోంది. దేశంలో సాగుకోసం 40 వేల టీఎంసీలు సరిపోతాయి. ప్రభుత్వం తలుచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వొచ్చు.’’ అని కేసీఆర్ అన్నారు.
2004లో వేసిన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇప్పటి వరకు నీటి వాటాలు తేల్చలేదని కేసీఆర్ అన్నారు. ‘‘ఇప్పటికీ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు ఎందుకు? సరిపడా జలాలు ఉన్నా.. రాష్ట్రాలు ఎందుకు కొట్టుకుంటున్నాయి? భారీ రిజర్వాయర్ల నిర్మాణం గురించి కేంద్రం ఎందుకు ఆలోచించడం లేదు. దేశ ప్రగతి కోసం అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచనలు కావాలి. దేశ జలవిధానం పూర్తిగా మారాలి. మన దేశానికి 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఉంది. అయినా, అనేక రాష్ట్రాలు విద్యుత్ కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో కూడా నీరు, విద్యుత్ కొరత ఉంది. దేశంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. న్యూయార్క్, లండన్లో కరెంట్ పోవచ్చుగానీ, హైదరాబాద్లో పోదు’’ అని కేసీఆర్ అన్నారు.
ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తుల అమ్మకం
స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు గడిచినా ఎన్నో విషయాల్లో భారత్ వెనకబడి ఉందని కేసీఆర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నాయకులంతా సమస్యల పరిష్కారం వదిలేసి మాటలతో కాలం గడుపుతున్నారని అన్నారు. భారాసకు అధికారమిస్తే జలవిధానం పూర్తిగా మార్చేస్తామని చెప్పారు. దేశంలో కీలక ప్రాంతాల్లో భారీ నీటి ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు. వ్యాపారం ప్రభుత్వ విధానం కాదని మోదీ చెబుతున్నారనీ, ప్రభుత్వం ఎందుకు వ్యాపారం చేయకూడదని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారని ఆరోపించారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను కూడా విక్రయించారని విమర్శించారు.
బొగ్గు దిగుమతిపై మతలబు ఏంటి?
దేశంలో పుష్కలంగా బొగ్గు లభ్యమవుతుండగా విదేశాల నుంచి ఎందుకు కొనాలని కేసీఆర్ ప్రశ్నించారు. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి వెనకున్న మతలబు ఏంటని అన్నారు. దేశంలో 360 టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయన్న కేసీఆర్.. మన దేశ బొగ్గు నిల్వలతో 125 ఏళ్లపాటు దేశమంతటికీ విద్యుత్ ఇవ్వొచ్చని చెప్పారు. ‘‘విద్యుత్ రంగంలో ప్రైవేటు సంస్థలను కేంద్రం ఎందుకు ప్రోత్సహిస్తోంది భారాస అధికారంలోకి వచ్చాక 90శాతం విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయి.’’ అని కేసీఆర్ అన్నారు.
అదానీ అంతవేగంగా ఎలా ఎదిగారు?
ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ లాభాల్లో కొనసాగుతుండగా, దాన్ని ఎందుకు అమ్ముతున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. ‘‘అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ భారీగా పెట్టుబడి ఎందుకు పెట్టాల్సి వచ్చింది. సాధారణ వ్యాపారి అయిన అదానీ.. రెండేళ్లలోనే ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి ఎలా ఎదిగారు?ప్రధాని మిత్రుడైన అదానీ అంత వేగంగా ఎలా డెవలప్ అయ్యారు? అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలి. అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో సమాధానం చెప్పి తీరాలి.’’ అని కేసీఆర్ డిమాండ్ చేశారు. మహిళ ప్రాతినిధ్యం ఉన్న సమాజం అద్భుత ప్రగతి సాధిస్తుందన్న కేసీఆర్.. భారాస అధికారంలోకి వస్తే చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. చైనా నుంచి వెళ్లిపోతున్న కంపెనీలను భారత్ ఎందుకు ఆకర్షించడం లేదని ప్రశ్నించారు. భారత్ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే
భాజపా ఇచ్చిన హామీలకు 2004 ఫలితాలే పునరావృతం అవుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. -
YSRCP: చిలకలూరిపేట పంచాయితీ.. మల్లెల రాజేశ్కు సీఎంవో నుంచి పిలుపు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైకాపా (YSRCP) పంచాయితీ తాడేపల్లికి చేరింది. అక్కడి వైకాపా నేత మల్లెల రాజేశ్ నాయుడుకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. -
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
Pashupati Paras: కేంద్రమంత్రి పశుపతి కుమార్ పరాస్ తన పదవికి రాజీనామా చేశారు. బిహార్లో చిరాగ్ పాసవాన్కు చెందిన ఎల్జేపీ (రాంవిలాస్)తో భాజపా పొత్తు పెట్టుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. -
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
తెదేపా (TDP) ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) కసరత్తు చేస్తున్నారు. -
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు వైకాపా నేతలపై పోలీసులు సోమవారం కేసులు నమోదు చేశారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ
ప్రజలతో మమేకమయ్యేందుకు తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి లోకేశ్ సోమవారం ‘రచ్చబండ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ప్రధాని సభలో ఇంత భద్రతా వైఫల్యమా?
‘ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్న ప్రజాగళం బహిరంగ సభలో అడుగడుగునా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. సభలో ఎక్కడా ప్రజలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. -
జనం తోసుకుంటుంటే చోద్యం చూశారు
ప్రధాని మోదీ పాల్గొన్న బొప్పూడి ప్రజాగళం సభకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ధ్వజమెత్తారు. -
ప్రభుత్వ వెబ్సైట్లలో ఫొటోలు తొలగించాలి
ప్రభుత్వశాఖల వెబ్సైట్లలో ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉండడంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)కి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. -
ప్రధాని సభకు ఆటంకాల వెనుక జగన్ హస్తం
ప్రధానమంత్రి పాల్గొన్న ప్రజాగళం సభకు ఆటంకాలు సృష్టించడం వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందని మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. -
లక్షల మంది తరలివచ్చి కూటమిని ఆశీర్వదించారు
చిలకలూరిపేటలో భాజపా, తెదేపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వంటిది ఈ దశాబ్దంలో చూడలేదని జనం చెబుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపు చేపడితే మేలు
ఏపీలో మే 13న ఎన్నికలు ముగిశాక సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపును చేపట్టాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. -
జగన్ అరాచక పాలనకు మోదీ అండ: సీపీఐ
వైఎస్ వివేకా హత్య కేసు నిందితులను సీబీఐ ఇంతవరకు గుర్తించకపోవడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. -
కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్ యథావిధిగా జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. -
వైకాపా అధిష్ఠానానికి నగరి అసమ్మతి నేతల ఝలక్
చిత్తూరు జిల్లా నగరి సీటును మంత్రి రోజాకు కేటాయిస్తే తాము పని చేయమని వైకాపా అసమ్మతి నేతలు తెగేసి చెప్పినా, రెండ్రోజుల క్రితం ఆమె అభ్యర్థిత్వాన్నే జగన్ ఖరారు చేశారు. -
కడపలోనూ కొండలు కొల్లగొట్టేశారు...
ముఖ్యమంత్రి జగన్ సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో కొండలు, గుట్టలను వైకాపా నేతలు అయిదేళ్లుగా వరుసబెట్టి మింగేశారు. -
హిందూమతం అంతమే వారి లక్ష్యం
దేశంలో హిందూమతాన్ని, శక్తి ఆరాధనను అంతం చేసేందుకు ఇండియా కూటమి కంకణం కట్టుకుందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. -
ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి సవాంగ్ రాజీనామా చేయాలి
గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం మూడుసార్లు చేస్తే ఒక్కసారే జరిగిందంటూ ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్సవాంగ్ బుకాయించడం సిగ్గుచేటని, ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని.. తక్షణం రాజీనామా చేయాలని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. -
ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేని అసమర్థ సీఎం జగన్
జగన్రెడ్డి అయిదేళ్ల పాలనలో జలవనరుల రంగంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా రైతులకు కన్నీరు మిగిల్చారని జలవనరుల శాఖ మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. -
గెలుపే లక్ష్యంగా పని చేయాలి
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెదేపా, భాజపా అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
TCS: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో వేతన పెంపు!
-
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే
-
Flight Journey: ‘బరువు ఉన్నామని విమానం నుంచి దించేశారు’
-
YSRCP: చిలకలూరిపేట పంచాయితీ.. మల్లెల రాజేశ్కు సీఎంవో నుంచి పిలుపు
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం