CM Kcr: నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా: సీఎం కేసీఆర్
దిల్లీలో ఆదివారం జరిగే నీతిఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నానని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతిభవన్లో ఏర్పాటు చేసిన మీడియా
హైదరాబాద్: దిల్లీలో ఆదివారం జరిగే నీతిఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నానని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతిభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. చాలా బాధాకరమే అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపట్ల నిరసన తెలియజేయడానికి ఇదే ఉత్తమమైన మార్గంగా భావించినట్టు చెప్పారు. తమ నిరసనను బహిరంగ లేఖ ద్వారా నేరుగా ప్రధానికి తెలియజేస్తున్నామని వెల్లడించారు.
‘‘స్వాతంత్ర్య పోరాటం జరిగే సమయంలోనే .. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అనేదానిపై చర్చలు జరిగాయి. స్వాతంత్ర్య భారతావని ఎలా ఉండాలనేదానిపై జరిగిన చర్చోపచర్చల ఫలితంగానే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. దీని ద్వారా ప్రణాళికలు రూపకల్పన చేసి.. కేంద్రం ఎలా వ్యవహరించాలి, రాష్ట్రం ఎలా వ్యవహరించాలనేది నిర్ణయించారు. వార్షిక ప్రణాళికలు ఉండాలి, పంచవర్ష ప్రణాళికలు ఉండాలి... వాటిని అనుసరించి విజన్ఉండాలని ఆలోచనలు జరిగాయి. నెహ్రూ ప్రధాని అయిన తర్వాత ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అమల్లోకి వచ్చింది. భారత ప్రణాళిక సంఘం అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉండేవి. ఎందరో మహానుభావులు అందులో సభ్యులుగా ఉన్నారు. దేశానికి అవసరమైన కీలక నిర్ణయాలు ప్రణాళిక సంఘం తీసుకునేది’’ అని సీఎం కేసీఆర్ వివరించారు.
నీతి ఆయోగ్ నిరర్థక సంస్థగా మారింది..!
‘‘ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాను రద్దు చేసి దానికి ప్రత్యామ్నాయంగా నీతి ఆయోగ్ తీసుకొచ్చారు. నీతి ఆయోగ్ను టీమ్ ఇండియా అని పిలుస్తామని ప్రధాని మోదీ చెప్పారు. నీతిఆయోగ్ ద్వారా సహకార సమాఖ్య విధానాన్ని పాటిస్తారని భావించాం. దేశానికి మంచి రోజులు వస్తాయని ఆశించాం. కానీ, దురదృష్టవశాత్తూ నిరర్థక సంస్థగా మారింది. నేతి బీరకాయలో నెయ్యి చందంగా నీతి ఆయోగ్ పరిస్థితి తయారైంది. దేశంలో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. దేశ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా 13 నెలల పాటు రైతులు ఆందోళన చేశారు. చివరకు నల్ల చట్టాలు రద్దు చేసి ప్రధాని స్వయంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఆదాయం రెట్టింపు కాకపోగా ఖర్చులు రెట్టింపయ్యాయి. దేశంలో సాగుకు నీరు దొరకట్లేదు, విద్యుత్ లేదు. భాజపా 8ఏళ్ల పాలనలో ఏం అభివృద్ధి జరిగింది? దేశ రాజధానిలో కూడా తాగడానికి మంచి నీళ్లు లేవు. నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతోంది. దేశం నుంచి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతున్నాయి. దాదాపు 16 రాష్ట్రాల నుంచి ఉపాధి హామీ కూలీలు దిల్లీలోని జంతర్మంతర్ వద్దకు వెళ్లి ధర్నా చేసే పరిస్థితి ఏర్పడింది. అదుపులేకుండా పోతున్న ద్రవ్యోల్బణం, జీడీపీ పతనం, పెరుగుతున్న నిత్యావసర ధరలు అంతులేకుండా పెరుగుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పాతాళానికి పడిపోయింది. దేశంలో పరిస్థితి చూస్తుంటే నీతి ఆయోగ్ ఏం ఒరగబెట్టింది? నీతి ఆయోగ్ సిఫార్సులను కూడా కేంద్రం గౌరవించడంలేదు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. కానీ, కేంద్రం పట్టించుకోలేదు’’ అని సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు.
దిల్లీ నడివీధుల్లో కత్తులు పట్టుకుని స్వైర విహారం చేస్తున్నారు..
‘‘రాష్ట్రాలకు ప్రత్యేక పరిస్థితులు, సమస్యలు ఉంటాయి. కేంద్రం ఇచ్చే గ్రాంట్ నేరుగా రాష్ట్రాలకు ఇవ్వాలని చెబితే ప్రధానమంత్రి అంగీకరించారు. కానీ, అలా చేయడంలేదు. సహకార సమాఖ్య విధానం పోయి ఆదేశిత సమాఖ్య విధానం వచ్చింది. ‘మేము చెప్పింది చేయకపోతే మీ కథ చూస్తాం’ అనే పరిస్థితికి వచ్చారు. హనుమాన్ జయంతి రోజు దిల్లీ నడివీధుల్లో కత్తులు పట్టుకుని స్వైర విహారం చేస్తున్నారు. ఇదేనా.. నీతి ఆయోగ్ ఇచ్చే సందేశం. అంతర్జాతీయ విపణిలో మన దేశ పరువు పోతోంది. ఆర్థిక వేత్తలు ఎంత చెబుతున్నా పట్టించుకోవడంలేదు. నీతి ఆయోగ్ రూపకల్పనలో ఎవరికీ ప్రమేయం ఉండదు. ఎవరు ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. పన్నుల వసూలులో రాజ్యాంగపరంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి. రాష్ట్రాలకు రావాల్సిన రూ.14లక్షల కోట్ల నిధులను కొల్లగొట్టారు. టీమ్ ఇండియా చేసే పని ఇదేనా? నీతి ఆయోగ్ సమావేశం భజన మండలి సమావేశంగా మారింది. ప్రగతిలో దూసుకెళ్తున్న రాష్ట్రాల కాళ్లలో కట్టెలు పెట్టవద్దని నీతి ఆయోగ్ సమావేశాల్లో చెప్పాను. దేశం మొత్తానికి విద్యుత్, నీళ్లు ఎలా ఇవ్వొచ్చో వివరించా. కానీ, నా సూచనలను నీతిఆయోగ్ పెడచెవిన పెట్టింది. రాష్ట్రంలో ఎన్నో పథకాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. కేంద్రం నుంచి ప్రశంసలే తప్ప.. నిధులు రాలేదు. శుష్కప్రియాలు.. శూన్య హస్తాలు అన్నట్టు కేంద్రం విధానం ఉంది. కేంద్ర - రాష్ట్ర ఉమ్మడి పథకాల్లో తెలంగాణ రూ.1.92లక్షల కోట్లు ఖర్చు చేసింది. కేంద్రం నుంచి మాత్రం రాష్ట్రానికి రూ.5వేల కోట్లు వచ్చాయి. కేంద్రానికి మేము పంపించిన ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు చేశారు. జీఎస్టీ బకాయిలు కూడా చెల్లించకుండా పెండింగ్లో ఉన్నాయి’’ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
మీరు కబళించిన రాజ్యాంగ సంస్థలే రేపు మిమ్మల్ని కబళిస్తాయి..
‘‘దేశంలో ఏకస్వామ్య పార్టీ విధానం వస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు అన్నారు. ఈ నిరంకుశ విధానం దేశానికి మంచిదా? ప్రశ్నించిన రైతులను కార్లతో తొక్కించారు. రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటున్నారు. మీరు కబళించిన రాజ్యాంగ సంస్థలే రేపు మిమ్మల్ని కూడా కబళిస్తాయి. దేశ మంతా ఏక్నాథ్ శిందేలను సృష్టిస్తామని బెదిరిస్తున్నారు.. ఇదేనా సమాఖ్య స్ఫూర్తి. ప్రభుత్వాలను కూల్చడమే సమాఖ్య విధానమా? పాలు, పెరుగు మీద పన్ను.. చివరికి శ్మశానంలో కూడా పన్ను వేస్తున్నారు. గార్భా అనే నృత్యం మీద కూడా పన్ను వేశారు. ఇప్పటికైనా ప్రధాని తన బుద్ధి మార్చుకుంటారనే సమావేశాన్ని బహిష్కరిస్తున్నా. ఉచిత పథకాలు రద్దు చేయాలని కొత్తగా తెరలేపారు. వృద్ధులకు పింఛన్లు ఇవ్వడం ఉచితమా? రైతులకు రైతుబంధు, రైతు బీమా ఇవ్వడం ఉచితమా? కొన్ని సంస్థలకు ఎన్పీఏల పేరిట రూ.12లక్షల కోట్లు ఇచ్చారు. ఎన్పీఏలు రూ.2లక్షల కోట్ల నుంచి 20లక్షల కోట్లకు పెరిగాయి. మహత్తరమైన పాలన అందిస్తే ఎన్పీఏలు తగ్గాలి కదా? ఎందుకు 10 రెట్లు పెరిగింది. కొన్ని సంస్థలు, అధికారులు కుమ్మక్కై ఎన్పీఏలకు దోచిపెడుతున్నారు. కొందరు రూ.లక్షల కోట్లు బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయారు. మేకిన్ ఇండియా అంటే పతంగులు ఎగరేసే మాంజా కూడా చైనా నుంచే వస్తుందా? మేకిన్ ఇండియాతో దిగుమతులు తగ్గాలా? పెరగాలా? ఇండియా భూభాగం 80కోట్ల ఎకరాలు. ఇందులు సాగుకు పనికొచ్చే భూమి 40కోట్ల ఎకరాలు. రూ.3లక్షల కోట్లు బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకుని విదేశాలకు పారిపోతున్నారు. విదేశీ మారక నిల్వలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. మనదేశంలో కూడా శ్రీలంక పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు’’ అని సీఎం వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా వైపు ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
కృష్ణుడి గోపికను నేనే.. హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి. -
లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. -
రైతులను అప్పుల్లో ముంచిన జగన్
సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. -
సీఎం జగన్ అవినీతిపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం
ముఖ్యమంత్రి జగన్ అవినీతిపై ఛార్జ్షీట్ రూపొందిస్తామని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
‘నాడు-నేడు’ కార్యశాల పేరిట వైకాపా డప్పు
గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు.