Ts News: వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం: సీఎం కేసీఆర్
ఎరువుల ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు...
హైదరాబాద్: ఎరువుల ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎరువుల ధరలు పెంచి అన్నదాతల నడ్డి విరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం.. వ్యవసాయ ఖర్చులు పెంచడం దుర్మార్గమని కేసీఆర్ ఆక్షేపించారు.
‘‘పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలు తీసుకుంటుంది. రైతులకు వారి పొలాల్లోనే కూలీలుగా మార్చాలని చేస్తోంది. వ్యవసాయం, అనుబంధ రంగాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోంది. గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసేలా విధానాలు తీసుకొస్తోంది. కేంద్రంలోని భాజపా పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం. దేశంలో అన్నదాతలను బతకనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కరెంటు మోటార్లకు మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేస్తున్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయకుండా జాప్యం చేస్తున్నారు. విపరీతంగా ఎరువుల ధరలు పెంచి రైతుల ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలకు పూనుకుంటోంది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్న భాజపాని కూకటివేళ్లతో పెకలించి వేయాలి. దశాబ్దాలుగా కొనసాగుతోన్న ఎరువుల రాయితీని ఎత్తివేసి అన్నదాతలను వ్యవసాయం చేయకుండా చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రైతులు తిరగబడాల్సిన అవసరం ఉంది. భాజపాకు, కేంద్రానికి బుద్ధి వచ్చే వరకు ఎక్కడికక్కడ ప్రజలు నిలదీయాలి. తక్షణమే పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలి. లేదంటే ఆందోళన ఉద్ధృతం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను రాష్ట్ర రైతులు అర్థం చేసుకోవాలి’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎరువుల ధరల పెంపుపై ప్రధాని మోదీకి ఇవాళ సాయంత్రం బహిరంగ లేఖ రాయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?