CM Kcr: నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టాలి: కేసీఆర్
ఎనిమిదేళ్ల పాలనలో దేశాన్ని భాజపా సర్వనాశనం చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. భువనగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్ భన సముదాయాన్ని
రాయగిరి: ఎనిమిదేళ్ల పాలనలో దేశాన్ని భాజపా సర్వనాశనం చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. భువనగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం రాయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.‘‘ నాడు భువనగిరి ప్రజలు ఉద్యమంలో నా వెంట నడిచారు. భువనగిరి ప్రజలు బెబ్బులిలా తెలంగాణ కోసం పోరాటం చేశారు. ఒకప్పుడు కరెంటు కోసం కటకటలాడిన తెలంగాణ ఇవాళ దేశంలోనే నెంబర్ వన్గా నిలిచింది. ఎనిమిదేళ్లుగా కేంద్రం తెలంగాణను పట్టించుకోలేదు. అయినా, తలసరి ఆదాయంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాం. భువనగిరి జిల్లాలో ఉన్న వెనకబాటుతనం క్రమంగా తొలగిపోతోంది. కొద్ది రోజుల్లోనే ఈ ప్రాంతానికి కాళేశ్వరం జలాలు వస్తాయి. కేంద్రం సహకరించకున్నా రాష్ట్రాన్ని అభివృధ్ధి వైపు తీసుకెళ్లాం. సమైక్య రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, వలసలు వెళ్లారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా సాగునీరు, విద్యుత్ ఉచితంగా ఇవ్వరు. ఇచ్చినా 24 గంటలూ ఇవ్వరు. తెలంగాణలోనే 24 గంటలు ఉచితంగా ఇస్తున్నాం.
బెదిరిస్తే... కేసీఆర్ భయపడతాడా?
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పిచ్చి ముదిరి పిచ్చి పిచ్చి చట్టాలు తెస్తున్నారు. నల్లచట్టాలు తెచ్చి ఏడాది పాటు రైతులను ఏడిపించారు. దిల్లీలో సరిహద్దుల్లో రైతులపై లాఠీఛార్జి చేశారు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే రైతులకు భయపడి నల్ల చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని ప్రకటించి దేశానికి క్షమాపణలు చెప్పారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే డబ్బులిస్తాం.. లేకపోతే ఇవ్వమని చెబుతున్నారు. విద్యుత్ మోటార్ల వద్ద మీటర్లు పెడదామా? నేను చనిపోయినా సరే.. విద్యుత్ సంస్కరణలు ఒప్పకోను. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టాలి. 8 ఏళ్ల భాజపా పాలన దేశాన్ని సర్వనాశనం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మనవరకూ రావాలి కదా. ఏ రంగానికి మంచి చేశారు... ఎవరికి లాభం జరిగింది. ఇది మాట్లాడితే.. కేసీఆర్ నీ సంగతి చూస్తామంటున్నారు. ఏం చూస్తారు నా.. సంగతి. కేసీఆర్ భయపడతాడా? భయపడితే తెలంగాణ వచ్చేదా? విద్యార్థులు, మేధావులు ఆలోచన చేయాలి.
సిలికాన్ వ్యాలీని కశ్మీర్ వ్యాలీగా మారుస్తారా?
శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ఈ దేశం ఎవడి అయ్య సొత్తు కాదు. దేశాన్ని నాశనం చేస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరు. కర్ణాటకలో విద్యార్థులపై రాక్షసంగా ప్రవర్తించవచ్చా? సాఫ్ట్వేర్ రంగానికి ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరు మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానంలో హైదరాబాద్ ఉంది. సిలికాన్ వ్యాలీని కశ్మీర్ వ్యాలీగా మారిస్తే పెట్టుబడులు ఎవరు పెడతారు?దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది నిజం కాదా? పారిశ్రామిక ఉత్పత్తులు పడిపోతున్నాయి. దేశంలో 15.. 16లక్షల పరిశ్రమలు మూతపడిన విషయం వాస్తవం కాదా? 140 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో మత విద్వేషంతో ఎవరి కడుపు నిండుతుంది. మత పిచ్చి అవసరమా? మోదీ.. ఏరంగానికి మేలు చేశారు. మోదీ పాలనలో ఇప్పటికే దేశం నష్టపోయింది. రాజకీయంగా స్పందించకపోతే దేశం నాశనమైతుంది. చాలా బాధతో ఈ మాట చెబుతున్నా. అమెరికాలాంటి దేశాల్లో మత పిచ్చి ఉండదు.. అందుకే అభివృద్ధి చెందింది. రాహుల్ను ఉద్దేశించి అసోం సీఎం చేసిన వ్యాఖ్యలు నన్ను కలచివేశాయి. రాహుల్గాంధీ నాన్న, నాయనమ్మ దేశం కోసం అమరులయ్యారు. మోదీ గారు.. అసోం సీఎం చేసిన వ్యాఖ్యలే మీ సంస్కారమా? అసోం ముఖ్యమంత్రిని వెంటనే భర్తరఫ్ చేయాలి.
కేంద్రం అవినీతి చిట్టా అందింది
ఆకలి రాజ్యాల జాబితాలో భారత్ 101వ స్థానంలో ఉంది. మోదీ పాలనలో దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చారు. కరోనా సమయంలో మోదీ తెలివితక్కువ లాక్డౌన్ నిర్ణయం వల్ల కోట్లాది మంది ఇబ్బందులు పడ్డారు. కేంద్రంలో జరిగే అవినీతి బాగోతాల చిట్టా నాకు అందింది. నిన్నే మమతా బెనర్జీ , మొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ఠాక్రే మాట్లాడారు. కేంద్రంపై అందరం కలిసి పోరాటం చేయాలి. నిన్న జనగామలో మాట్లాడితే భాజాపా నేతలు.. నువ్వెంత అని నన్ను విమర్శిస్తున్నారు. తెలంగాణ సమాజం మేల్కొనాలి.. దొంగలతో పోరాటం చేయాలి. దేశ రాజకీయాల్లో మొలిచిన కుక్కమూతి పిందె ఈ భాజపా. ఈ దరిద్రాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటేనే.. ఈ దేశానికి అంతా మంచి జరుగుతుంది. దేశమంతా తిరిగి అన్ని భాషల్లో వీరి భాగోతాలు చెబుతా’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
ఇటీవల తన తల్లి మృతి నేపథ్యంలో హమీర్పుర్ సీటు తనకు ఇచ్చినా పోటీ చేసే ఉద్దేశం లేదని డిప్యూటీ సీఎం కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి అన్నారు. -
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా నడుస్తోందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. -
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
మహారాష్ట్రలోని బారామతిలో ఉత్కంఠ పోరు నెలకొంది. పవార్ కుటుంబంలోని ఇద్దరు మహిళలు పరస్పరం తలపడటం ఉత్కంఠ రేపుతోంది. -
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్డీఏ కూటమి నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. -
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
తెలుగుదేశం అభ్యర్థులకు అధినేత చంద్రబాబు ఈనెల 21న బీఫామ్లు అందజేయనున్నారు. -
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నారా లోకేశ్ నామినేషన్ దాఖలు చేశారు. -
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
రాష్ట్రానికి ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
భీమిలి, జీడీ నెల్లూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైకాపా నేతలు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. -
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. -
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
వైఎస్ఆర్ హయంలో హంద్రీనీవా ప్రాజెక్టు 90 శాతం పూర్తి అయిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పూర్తి చేసి -
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
మాజీ మంత్రి వివేకానందరెడ్డి 40 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేశారని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. -
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీకి చెందిన గూండాలు అరాచకం సృష్టించారు. -
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
కాంగ్రెస్కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో భాజపా (BJP) విజయం సాధించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు. -
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. -
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ తెదేపా అభ్యర్థి బొండా ఉమాను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. -
వాల్తేరు క్లబ్లో వైకాపా డిష్యుం డిష్యుం!
వాల్తేరు క్లబ్ ప్రభుత్వ భూమి. ఈ రోజుకూ నేను అదే చెబుతున్నా. ఏ రోజైనా ఒక సామాజికవర్గం చేతిలో ఉండి ఉండొచ్చు. -
నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు
నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు (Lok sabha Elections) నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల