JP Nadda: 93 ఎపిసోడ్‌లు అయ్యాయి.. మోదీ ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడలేదు: నడ్డా

భాజపా శ్రేణులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక ఆదేశాలు జారీ చేశారు. అందరూ కలిసి ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్‌’....

Published : 25 Sep 2022 15:56 IST

‘మన్‌కీ బాత్‌’ చూశాకే సమావేశాలు నిర్వహించండి.. పార్టీ శ్రేణులకు నడ్డా ఆదేశం

కోచి: భాజపా శ్రేణులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక ఆదేశాలు జారీ చేశారు. అందరూ కలిసి ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమం విన్న తర్వాతే బూత్‌ స్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. గత కొన్నేళ్లుగా ప్రధాని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని వింటోన్నవారి సంఖ్య ప్రతి నెలా పెరుగుతోందన్నారు. అందరూ కలిసికట్టుగా ‘మన్‌ కీ బాత్‌’ ఆలకించేలా పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు మండల, తాలుకా, ప్రాంతీయ, బూత్‌ స్థాయిల్లోని అధ్యక్షులందరూ కలిసికట్టుగా కృషిచేయాలని సూచించారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళకు వచ్చిన నడ్డా.. అలువా సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి జావడేకర్‌తో పాటు పలువురు నేతలతో కలిసి ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమాన్ని ఆలకించారు. అనంతరం నడ్డా మాట్లాడుతూ.. 2014 నుంచి ఇప్పటివరకు 93 మన్‌కీ బాత్‌ ఎపిసోడ్‌లు జరిగాయన్నారు. అయితే, ఈ కార్యక్రమం వేదికగా ప్రధాని ఎప్పుడూ రాజకీయాలు అంశాలు మాట్లాడలేదని.. సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ, స్వచ్ఛత తదితర అంశాలతో పాటు ఎంతో స్ఫూర్తినిచ్చే వ్యక్తులు, క్రీడల గురించే మాట్లాడారని చెప్పారు. అలాగే, హిందుత్వ సిద్ధాంతకర్త, భారతీయ జనసంఘ్‌ నేత దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన సేవలను  నడ్డా గుర్తుచేసుకున్నారు. ఆయన తమ సిద్ధాంతకర్త అని.. ఎప్పుడూ సమగ్రమైన మానవత్వం గురించి మాట్లాడేవారన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని