TS news: మంత్రి జగదీశ్‌రెడ్డి-ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రి జగదీశ్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

Published : 27 Jul 2021 01:41 IST

చౌటుప్పల్‌: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రి జగదీశ్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రొటోకాల్‌ ప్రకారం సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి చేతిలోంచి ఆయన మైక్‌ లాక్కోవడం స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్‌, తెరాస శ్రేణులు పరస్పరం నినాదాలు చేసుకోవడం గందరగోళానికి దారి తీసింది. ఈ క్రమంలో మంత్రి, ఎమ్మెల్యే అనుచరుల మధ్య పరస్పర తోపులాట చోటు చేసుకుంది. 60 ఏళ్లలో ఏమీ చేయలేని కాంగ్రెస్‌ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని