Parliament sessions: మూడో రోజూ అదే తీరు.. కాంగ్రెస్పై పీయూష్ గోయల్ ఫైర్
కొన్ని వస్తువులపై జీఎస్టీ బాదుడు, నిత్యావసరాల ధరల పెరుగుదలపై పార్లమెంటులో విపక్షాల నిరసనల హోరు మూడో రోజూ .....
(రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల నిరసన)
దిల్లీ: కొన్ని వస్తువులపై జీఎస్టీ బాదుడు, నిత్యావసరాల ధరల పెరుగుదలపై పార్లమెంటులో విపక్షాల నిరసనల హోరు మూడో రోజూ కొనసాగింది. సామాన్యుడి నడ్డి విరిచేలా భారం పెంచుతున్నారంటూ విపక్ష పార్టీలు ఉభయ సభల్లో కార్యకలాపాలను స్తంభింపజేశాయి. సభాకార్యకలాపాలకు అడ్డుతగలడంతో ఉభయ సభలూ గురువారానికి వాయిదా పడ్డాయి. అయితే, పార్లమెంట్లో కాంగ్రెస్ తీరుపట్ల కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభాకార్యకలాపాలకు అడ్డు తగులుతూ.. ప్రజాస్వామ్యం పట్ల కాంగ్రెస్ పార్టీ విధ్వంసకర వైఖరిని అనుసరిస్తోందన్నారు. సభ జరగనీయకుండా చేయడంలో కాంగ్రెస్ విజయం సాధించిందంటూ ఎంపీ జైరాం రమేశ్ చేసిన ట్వీట్తోనే ఆ విషయం అర్థమైపోయిందంటూ ధ్వజమెత్తారు.
ధరల పెరుగుదల, జీఎస్టీ, ఇతర అంశాలపై చర్చ నుంచి ప్రభుత్వం పారిపోవడంలేదని, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కొవిడ్ నుంచి కోలుకొని వచ్చాక ఈ అంశాలపై చర్చ చేపడతామన్నారు. సభాకార్యకలాపాలను అడ్డుకోవడంలో విపక్షాలు పోటీ పడుతున్నాయంటూ పీయూష్ ఎద్దేవా చేశారు. మరోవైపు, ధరల పెరుగుదల, కొన్ని నిత్యావసరాలపై జీఎస్టీ విధించిన అంశంపై తక్షణమే చర్చ చేపట్టాలని, కొన్ని వస్తువులపై విధించిన జీఎస్టీని ఉపసంహరించుకోవాలంటూ విపక్షాలు చేస్తోన్న డిమాండ్కు ఆయన కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా జీఎస్టీ కౌన్సిల్లో ఉన్నాయని.. జీఎస్టీ పెంపు నిర్ణయానికి వారూ అంగీకరించారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!