Up Elections: ప్రియాంక ఎఫెక్ట్.. భాజపాలో మహిళలకు ప్రాధాన్యం!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు అన్ని పార్టీల్లో మహిళలకు ప్రాధాన్యం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. తాజాగా మహిళా నేతలతో భాజపా నిర్వహించిన భారీ ర్యాలీనే ఇందుకు ఉదాహరణ అని.. దీన్నే ‘ప్రియాంక ఎఫెక్ట్’ అంటారని
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు అన్ని పార్టీల్లో మహిళలకు ప్రాధాన్యం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. తాజాగా మహిళా నేతలతో భాజపా నిర్వహించిన భారీ ర్యాలీనే ఇందుకు ఉదాహరణ అని.. దీన్నే ‘ప్రియాంక ఎఫెక్ట్’ అంటారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.
ఆదివారం రాష్ట్ర రాజధానిలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో భాజపా మహిళా నేతలు ‘మహిళల భద్రత’పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఇటీవల భాజపాలో చేరిన అపర్ణయాదవ్(సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు), ప్రియాంక మౌర్య సహా పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు. కాగా.. ఈ ర్యాలీపై యూపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ కుమార్ స్పందించారు.
‘‘నేను మహిళను.. పోరాడగలను’ అనే నినాదంతో ప్రియాంక గాంధీ ప్రజల్లోకి వెళ్తున్నారు. మహిళల సమస్యలపై గళమెత్తుతున్నారు. ఈ క్రమంలోనే మా పార్టీ అభ్యర్థుల్లో 40శాతం టికెట్లు మహిళలకే కేటాయిస్తున్నాం. జనాభాలో సగం మంది మహిళలు ఉన్నప్పుడు.. వారిని ఏ పార్టీ నిర్లక్ష్యం చేయకూడదని ప్రియాంక గాంధీ భావిస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతోంది. మహిళలకు భాజపా ప్రాధాన్యమిచ్చి.. వారితో భారీ ర్యాలీ నిర్వహించడం ‘ప్రియాంక ఎఫెక్ట్’గానే అనిపిస్తుంది’’అని అజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతి కోసం భాజపా నిజంగా పాటుపడి ఉంటే.. ఇతర పార్టీల్లో పేరు ప్రఖ్యాతలు సాధించిన మహిళా నేతలను వారి పార్టీలోకి చేర్చుకునేది కాదని అజయ్ చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు