Congress: ఏఐసీసీ కీలక కమిటీలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి చోటు

ఈ కమిటీకి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. జాతీయ స్థాయి సమస్యలపై ఉద్యమాల ప్రణాళికల కమిటీలో......

Updated : 02 Sep 2021 18:20 IST

దిల్లీ: జాతీయస్థాయి సమస్యలపై పోరాటాలకు అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తం తొమ్మిదిమంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి స్థానం కల్పించారు. ఈ కమిటీకి ఛైర్మన్‌గా  సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ను నియమించారు. జాతీయ స్థాయిలో పోరాటాలకు ప్రణాళికలు రచించే ఈ కమిటీలో ప్రియాంకా గాంధీతో పాటు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మనీశ్‌ ఛత్రత్‌, బీకే హరిప్రసాద్‌, రిపున్‌ బోరా, ఉదిత్‌ రాజ్‌, రాగిణి నాయక్‌, జుబిర్‌ ఖాన్‌ సభ్యులుగా ఉంటారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని