Congress: కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు గడువు పొడిగింపు

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం గడువు నేటితో ముగియగా దాన్ని పొడిగించారు. ....

Published : 01 Apr 2022 01:27 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం గడువు నేటితో ముగియగా దాన్ని పొడిగించారు. ఏప్రిల్‌ 15వరకు సభ్యత్వ నమోదు కొనసాగుతుందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. గతేడాది నవంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌/భౌతిక పద్ధతుల్లో మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 1.2 కోట్లకు పైగా సభ్యత్వం నమోదైనట్టు పార్టీ వర్గాల సమాచారం. మరో 15 రోజుల పాటు సభ్యత్వ నమోదు గడువు పొడిగించాలన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇంఛార్జుల ప్రతిపాదనకు సోనియా గాంధీ ఆమోదం తెలిపినట్టు వేణుగోపాల్‌ తెలిపారు. పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా ఏప్రిల్‌ 15తో ఈ ప్రక్రియ ముగుస్తుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని