అభివృద్ధి కోసం భాజపాకు ఓటేయండి: నడ్డా
అసోంలో దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర భద్రతకు ప్రాధాన్యం ఇవ్వలేదని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. సోమవారం రాజ్గఢ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడారు.
గువహటి: అసోంలో దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర భద్రతకు ప్రాధాన్యం ఇవ్వలేదని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. సోమవారం రాజ్గఢ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా నడ్డా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ అసోం సంస్కృతిని దెబ్బతీసింది. రాష్ట్ర భద్రతను ఆ పార్టీ ఏమాత్రం పట్టించుకోలేదు. దాని ఫలితమే ఈ రోజు సమస్యలు పెరిగిపోయాయి. సరిహద్దుల్లో రాష్ట్రంలోకి అక్రమ చొరబాట్లు పెరిగిపోయాయి. కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలు చేస్తోంది. ఓవైపు కేరళలో ముస్లిం లీగ్తో పొత్తు పెట్టుకుని.. మరోవైపు అసోంలో బద్రుద్దీన్ అజ్మల్(ఏఐయూడీఎఫ్) పార్టీతో జతకట్టడానికి సిద్ధమైంది’ అంటూ కాంగ్రెస్పై నడ్డా విమర్శలు గుప్పించారు.
‘భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజుల్లో దేశంలో ఉన్న 2.5కోట్ల గృహాలను విద్యుదీకరించాం. నరేంద్రమోదీ ప్రభుత్వం వెదురుకు సంబంధించిన చట్టాలను సరళీకృతం చేసింది. అంతేకాకుండా 75 హెక్టార్లలో వెదురుకు సంబంధించిన పారిశ్రామిక పార్కును నిర్మిస్తోంది. రాష్ట్రంలో 3.3లక్షల మందికి స్థలాలు లీజుకు ఇచ్చాం. అంతేకాకుండా రహదారులను కూడా అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో ఖడ్గమృగాల వేటను నిర్మూలించాం. సరిహద్దుల్లో ఉపగ్రహల ద్వారా నిఘా పెంచి భద్రతను కట్టుదిట్టం చేశాం. కాబట్టి రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే భాజపాకు ఓటేయాలి’ అని నడ్డా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్