కేటీఆర్‌ను కలిస్తే తెరాసలో చేరినట్లా?: కౌశిక్‌రెడ్డి

తెరాస తనను ఆహ్వానించిందనటం అవాస్తవమని హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ నేత కౌశిక్‌రెడ్డి తెలిపారు. తెరాసలోకి వెళ్లనని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతాననితెరాస తనను ఆహ్వానించిందనటం అవాస్తవమని హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ నేత కౌశిక్‌రెడ్డి తెలిపారు. తెరాసలోకి వెళ్లనని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం

Published : 13 Jun 2021 01:10 IST

హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ నేత కౌశిక్‌రెడ్డి

హైదరాబాద్‌: తెరాస తనను ఆహ్వానించిందనటం అవాస్తవమని హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ నేత కౌశిక్‌రెడ్డి తెలిపారు. తెరాసలోకి వెళ్లనని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ నుంచే పోటీ చేశానని, ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ నుంచే పోటీ చేస్తానని తెలిపారు. కేటీఆర్‌ను కలిసినంత మాత్రాన తెరాసలోకి వెళ్లనని పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌దే విజయమని కేటీఆర్‌తోనూ చెప్పానని అన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ టికెట్‌ తనకే వస్తుందని ఆశిస్తున్నట్టు కౌశిక్‌రెడ్డి తెలిపారు.  తెరాస గురించి ఈటల రెండేళ్లుగా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి తెరాస ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈటల రాజేందర్‌ శాసనసభ సభ్యత్వానికి, తెరాసకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజూరాబాద్‌లో ఈటలకు దీటుగా బలమైన అభ్యర్థి కోసం తెరాస అన్వేషిస్తున్న సమయంలో ఇటీవల కేటీఆర్‌ను కౌశిక్‌రెడ్డి కలవడం చర్చనీయాంశమైంది. కౌశిక్‌ తెరాసలో చేరుతారనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి తన అభిప్రాయాన్ని మీడియాకు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని