Congress: హస్తానికి ఆ ‘రెండు’ రాష్ట్రాలే మిగిలాయి..!
కేంద్రంలో మోదీ అధికారం చేపట్టినప్పటినుంచి ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని ఓటములు ఎదురవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: 135 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దాదాపు అర్ధశతాబ్దానికి పైగా భారత్ను పాలించింది. స్థానికంగా కొత్తగా ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా బలమైన క్యాడర్తో దశాబ్దాల పాటు పలు రాష్ట్రాలను ఏకధాటిగా ఏలింది. సోనియాగాంధీ రాకతో పూర్వవైభవం వచ్చిందనుకొన్న ఆ పార్టీకి.. నరేంద్ర మోదీ ఎంట్రీ చెక్ పెట్టినట్లు అయ్యింది. కేంద్రంలో మోదీ అధికారం చేపట్టినప్పటినుంచి ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని ఓటములు ఎదురవుతున్నాయి. తాజాగా పంజాబ్లోనూ అధికారాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ దేశవ్యాప్తంగా గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది.
13 రాష్ట్రాల నుంచి రెండుకు..
ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఉన్న సమయంలో దేశ రాజకీయాల్లో మరోసారి బలమైన శక్తిగా కొనసాగింది. ఇలా 2011 నాటికి 11 రాష్ట్రాల్లో (రాజస్థాన్, దిల్లీ, హరియాణా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి), కేరళతోపాటు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపుర్, మిజోరం) కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. మరుసటి ఏడాది ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోనూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మొత్తం 13 రాష్ట్రాల్లో తన సత్తాను చాటింది.
కేంద్రంలో యూపీఏ కూటమి రెండో పర్యాయం ముగుస్తోన్న సమయంలో దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీచాయి. 2014లో నరేంద్ర మోదీ రాకతో జాతీయ స్థాయిలో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి.. అప్పటినుంచి ఆయా రాష్ట్రాల్లో జరుగుతోన్న ప్రతి ఎన్నికల్లోనూ ఓటమి తప్పడం లేదు. పెద్ద రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోయింది. తాజాగా పంజాబ్లోనూ ఓడిన కాంగ్రెస్ పార్టీ, చివరకు రెండు (రాజస్థాన్, ఛత్తీస్గఢ్) రాష్ట్రాలకే పరిమితమైంది. 2011 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ అధికారం కోల్పోతున్న రాష్ట్రాలను చూస్తే..
* 2011లో అస్సాం, కేరళలో విజయంతో 11 రాష్ట్రాల్లో అధికారంలో నిలిచింది.
* 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో విజయం. గోవాలో ఓటమి. కాంగ్రెస్ అధికారం 13 రాష్ట్రాలకు చేరింది.
* 2013లో కర్ణాటకలో గెలిచి, రాజస్థాన్లో ఓడింది. అదే ఏడాది మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు.
* 2014 జనరల్ ఎలక్షన్లలో ఓటమి. కీలకమైన మహారాష్ట్ర, దిల్లీ, హరియాణాల్లోనూ ఘోర పరాభవం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దారుణ ఓటమి.
* 2015 నాటికి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళతోపాటు ఐదు ఈశాన్య రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.
* 2016 ఎన్నికల్లో అస్సాం, కేరళ, అరుణాచల్ ప్రదేశ్లలో అధికారం కోల్పోయింది.
* 2017లో పంజాబ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఉత్తరాఖండ్, మణిపుర్, హిమాచల్ ప్రదేశ్లో ఓటమి పాలయ్యింది.
* 2018లో మిజోరం, మేఘాలయా రాష్ట్రాల్లోనూ అధికారాన్ని కోల్పోయింది. అయితే, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. కాస్త ఊపిరి పీల్చుకుంది.
* 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఓటమిని చవిచూసింది.
* 2021 ఐదు రాష్ట్రాల ఎన్నికలు. పుదుచ్చేరి, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్లో ప్రభావం చూపలేకపోయింది. ఒక్క తమిళనాడులో మాత్రం మిత్రపక్షం డీఎంకే అధికారంలోకి వచ్చింది.
* ప్రస్తుత ఐదు రాష్ట్రాల మినీ సంగ్రామంలోనూ కాంగ్రెస్కు ప్రతికూల ఫలితాలే ఎదురయ్యాయి. పంజాబ్లోనూ ఆ పార్టీ అధికారాన్ని కోల్పోతోంది. ఉత్తర్ప్రదేశ్లో పుంజుకోలేకపోయింది. అంతేకాకుండా ఉన్న స్థానాలనూ కాపాడుకోలేకపోయింది. గోవా, మణిపుర్లలోనూ వెనుకంజే.
ఇలా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఆరు రాష్ట్రాల్లోనే కొనసాగుతోంది. ఝార్ఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాల్లో కొనసాగుతోన్న కాంగ్రెస్. మరో మూడు రాష్ట్రాల్లోనే సొంత బలంతో నెట్టుకొస్తోంది. తాజా ఎన్నికల్లో కీలక రాష్ట్రమైన పంజాబ్లోనూ ఓటమి చెందడంతో చివరకు రాజస్థాన్, ఛత్తీస్గఢ్లకే కాంగ్రెస్ పరిమితమయ్యింది.
ప్రధాని మాటల్లో కాంగ్రెస్ గ్రాఫ్..
గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే మరో వందేళ్ల వరకు అధికారంలోకి రాదంటూ ఇటీవల జరిగిన లోక్సభ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. కొన్ని దశాబ్దాలుగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్కు ఆదరణ దక్కడం లేదని చెబుతూ పలు రాష్ట్రాల పేర్లను ఆయన ప్రస్తావించారు.
* 1998 నుంచి నాగాలాండ్ ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేయలేదు - 24ఏళ్లుగా
* 1995 నుంచి ఒడిశా ప్రజలు కాంగ్రెస్ను దూరం ఉంచారు - 27ఏళ్లుగా
* 1988నుంచి త్రిపుర ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరిస్తున్నారు - 34 ఏళ్లుగా
* 1985 నుంచి ఉత్తర్ప్రదేశ్, గుజరాత్, బిహార్ ప్రజలు కాంగ్రెస్ను దూరం పెట్టారు - 37 ఏళ్లుగా
* 1972 నుంచి పశ్చిమ బెంగాల్ ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టలేదు - 50 ఏళ్లుగా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
దక్షిణాదిలో భాజపా ఈసారి అత్యుత్తమ పనితీరు కనబరుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తంచేశారు. -
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం, రాజంపేట భాజపా అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. -
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
ఇటీవల తన తల్లి మృతి నేపథ్యంలో హమీర్పుర్ సీటు తనకు ఇచ్చినా పోటీ చేసే ఉద్దేశం లేదని డిప్యూటీ సీఎం కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి అన్నారు. -
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా నడుస్తోందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. -
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
మహారాష్ట్రలోని బారామతిలో ఉత్కంఠ పోరు నెలకొంది. పవార్ కుటుంబంలోని ఇద్దరు మహిళలు పరస్పరం తలపడటం ఉత్కంఠ రేపుతోంది. -
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్డీఏ కూటమి నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. -
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
తెలుగుదేశం అభ్యర్థులకు అధినేత చంద్రబాబు ఈనెల 21న బీఫామ్లు అందజేయనున్నారు. -
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నారా లోకేశ్ నామినేషన్ దాఖలు చేశారు. -
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
రాష్ట్రానికి ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
భీమిలి, జీడీ నెల్లూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైకాపా నేతలు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. -
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. -
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
వైఎస్ఆర్ హయంలో హంద్రీనీవా ప్రాజెక్టు 90 శాతం పూర్తి అయిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పూర్తి చేసి -
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
మాజీ మంత్రి వివేకానందరెడ్డి 40 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేశారని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. -
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీకి చెందిన గూండాలు అరాచకం సృష్టించారు. -
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
కాంగ్రెస్కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో భాజపా (BJP) విజయం సాధించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు. -
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. -
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ తెదేపా అభ్యర్థి బొండా ఉమాను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM