Jagga Reddy: రేవంత్తో కలిసి పనిచేసేందుకు ఇబ్బందేం లేదు.. కానీ..: జగ్గారెడ్డి
కాంగ్రెస్లోని కొందరు సోషల్ మీడియాలో తన పరువు తీస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నేత తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ఆరోపించారు.
హైదరాబాద్: కాంగ్రెస్లోని కొందరు సోషల్ మీడియాలో తన పరువు తీస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నేత తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో కలిసి పనిచేసేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియమించిన ఏ వ్యక్తితోనైనా కలిసి పనిచేస్తానని చెప్పారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశాలు, రేవంత్తో విభేదాలు, పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సీఎల్పీ కార్యాలయంలో జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
‘‘నిర్మొహమాటంగా నిజాలు మాట్లాడటం నా స్వభావం. ఇది కాంగ్రెస్ పంచాయితీ కాదు.. రేవంత్రెడ్డితోనే నా పంచాయితీ. మా ఇద్దరి గుణగణాల పంచాయితీ. రేవంత్రెడ్డి మెదక్ పర్యటనకు వెళ్తే నన్ను ఆహ్వానించలేదు. ఆ పర్యటనకు నన్ను పిలవకపోవడంతో నాకు కోపం వచ్చింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి పార్టీలో విలువ ఉండదా? పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ను కలుపుకొనిపోయే పద్ధతి లేదా?ఏ ఆలోచన లేని ఎమ్మెల్యే శ్రీధర్బాబుపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ఎవరికైనా మేలు జరుగుతుంది. సోనియాగాంధీ కుటుంబం వల్లే పార్టీ గొప్ప స్థాయికి చేరింది. కాంగ్రెస్పై అభిమానంతో ఎప్పటినుంచో ఈ పార్టీలో కొనసాగుతున్నా. నాకు, సీఎం కేసీఆర్కు రాజకీయంగా ఎలాంటి వివాదాలు లేవు’’ అని జగ్గారెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్