Telangana News: పులి లాంటి నేను ఎలుకలతో పోట్లాడను: జగ్గారెడ్డి

కాంగ్రెస్‌కు రాజీనామాను వాయిదా వేసుకుంటున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. 15 రోజులు వేచి చూసి రాజీనామాపై నిర్ణయం

Updated : 20 Feb 2022 13:20 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు రాజీనామాను వాయిదా వేసుకుంటున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. 15 రోజులు వేచి చూసి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద జగ్గారెడ్డి మాట్లాడారు.

‘‘పీసీసీ అధ్యక్షుడు సమస్య మూలాలను తెలుసుకోవట్లేదు. టీ కప్పులో తుపాను అంటూ తేలిగ్గా కొట్టి పారేస్తున్నారు. అసలు సమస్య ఎందుకు వచ్చిందో ఆలోచించట్లేదు. పార్టీలోని కొందరు నేతలు రెండ్రోజులుగా నాకు సర్ది చెబుతున్నారు. నా మీద దుష్ప్రచారం జరుగుతోంది. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలను కలిస్తే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నా. దిల్లీ అపాయింట్‌మెంట్‌ కోసం మా సీనియర్లు ప్రయత్నం చేస్తున్నారు. అవకాశం వస్తే వెళ్లి కలుస్తా.

ఆట మొదలెట్టా..

పార్టీలో సమస్యల గురించి 15 రోజులు మాట్లాడాను. మా పెద్దల మాటలను గౌరవించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. జగ్గారెడ్డి సమస్య కుటుంబ సమస్య అని పీసీసీ అనడం సహజం. నేను ఆట ప్రారంభించా.. వేచి చూడాలి. నా వెనుక ఎవరూ లేరు. పీసీసీ అధ్యక్షుడు వచ్చి కలిసినా పార్టీలో ఉండే పరిస్థితి లేదు. పులి లాంటి నేను ఎలుకలతో పోట్లాడను’’ అని జగ్గారెడ్డి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని