Siddaramaiah: రైతు కుటుంబంలో పుట్టి.. స్వయం కృషితో రెండు సార్లు సీఎంగా..!
కర్ణాటక సీఎం పదవి సిద్ధరామయ్యకే దక్కింది. డీకే శివప్రసాద్, సిద్ధూ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా అనుభవజ్ఞుడైన సిద్ధరామయ్యవైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గుచూపింది.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిని ఖరారు చేసింది. రాష్ట్రంలో పాపులర్ నేతగా ఉన్న సిద్ధరామయ్య వైపే అధిష్టానం మొగ్గు చూపింది. దీంతో ఐదేళ్ల విరామం తర్వాత కన్నడ సీఎం పీఠంపై మరోసారి సిద్ధరామయ్య ఆశీనులు కానున్నారు. ఈ మేరకు సిద్ధూ తన కొత్త జట్టుతో కలిసి మే 20న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే..
రైతు కుటుంబంలో పుట్టి రాజకీయ కృషీవలుడిగా..
సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సిద్ధరామయ్య స్వయంకృషితో ఎదిగారు. మైసూరు సమీపంలోని సిద్దరామనహుండిలో 1948 ఆగస్టు 12న జన్మించారు. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. రాష్ట్రంలో మూడో అతి పెద్ద సామాజిక వర్గమైన ‘కురుబ’ (ఓబీసీ)కు చెందిన నేత. ఉన్నత చదువులు అభ్యసించిన సిద్ధరామయ్య మైసూరులో న్యాయవాదిగా, న్యాయశాస్త్ర ఉపన్యాసకునిగా పని చేశారు. మరోవైపు, రైతు ఉద్యమాల్లో పాలుపంచుకుంటూ ప్రముఖ రైతు నాయకుడు నంజుండస్వామి ప్రియ శిష్యుడిగా పేరుగాంచారు. ఆయన స్ఫూర్తితోనే 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి రాజకీయ కృషీవలుడిగా అంచెలంచెలుగా ఎదిగారు.
తొలి పోటీలోనే సంచలన విజయం
1983లో చాముండేశ్వరి అసెంబ్లీ స్థానం నుంచి భారతీయ లోక్దళ్ అభ్యర్థిగా పోటీ చేసి సంచలన విజయం సాధించిన సిద్ధూ.. ఆ తర్వాత జనతా పార్టీలో చేరారు. అప్పటి సీఎం రామకృష్ణ హెగ్డే మాతృభాష పరిరక్షణ కోసం స్థాపించిన ‘కన్నడ కావలు సమితి’ తొలి అధ్యక్షుడిగా సమర్థంగా పనిచేశారు. 1985 ఎన్నికల్లో గెలిచి హెగ్డే ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 1989 ఎన్నికల్లో ఓడిపోయారు. 1992లో జనతాదళ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1994 ఎన్నికల్లో గెలిచి దేవెగౌడ నాయకత్వంలోని జనతాదళ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. దేవేగౌడ ప్రధాని పదవిని చేపట్టడంతో 1996లో జేహెచ్.పటేల్ సీఎం అయ్యారు. అనంతరం సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. జనతాదళ్ జేడీఎస్, జేడీయూగా చీలిపోవటంతో సిద్ధరామయ్య.. దేవెగౌడ నాయకత్వంలోని జేడీఎస్లో చేరి రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. 1999 విధాన సభ ఎన్నికల్లో ఓడిపోయారు. 2004లో ఏర్పడిన కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా సమర్థంగా పనిచేసే మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, దేవెగౌడ తన తనయుడు కుమారస్వామిని ముందుకు తెచ్చేందుకు 2006లో పార్టీ నుంచి సిద్ధరామయ్యను సస్పెండ్ చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్లో చేరారు. 2008 ఎన్నికల్లో గెలిచి సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. 1983 నుంచి ఇప్పటివరకు సిద్ధు మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
మాట కఠినం.. 13సార్లు బడ్జెట్ ప్రవేశట్టిన అనుభవం..
సిద్ధరామయ్య రాష్ట్ర రాజకీయాల్లో అశేష అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. దేవరాజ్ అరసు తర్వాత ఐదేళ్ల పాటు సీఎంగా పనిచేసింది ఈయనే కావడం విశేషం. అహింద (బలహీనవర్గాల) సముదాయానికి ప్రతినిధిగా ఉండేందుకు ఇష్టపడే సిద్ధూ.. జనతా పరివార్ నుంచి 2006లో కాంగ్రెస్లోకి వచ్చినా పార్టీ భావజాలాన్ని సులువుగానే ఆకళింపు చేసుకున్నారు. జనతాదళ్లోనూ డిప్యూటీ సీఎంగా, ఆర్థికమంత్రిగా పనిచేసి ఇప్పటివరకూ 13సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనదే. మాట కఠినంగా ఉన్నా అభిమానుల మనసులు గెలిచిన సిద్ధూపై అవినీతి ఆరోపణలు కూడా పెద్దగా ఏమీ లేవు. 2013లో కాంగ్రెస్కు 122 సీట్లతో విజయాన్ని అందించడంలో ఆయన పాత్రను విస్మరించని అధిష్ఠానం సీఎంగా ఆయనకే అవకాశం ఇచ్చింది. అధిష్ఠానం విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఏ పార్టీ అమలు చేయనన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలపైనా ఆయనకు పట్టు ఉంది. అపారమైన రాజకీయ అనుభవం.. పార్టీని, ప్రభుత్వాన్ని ఒంటిచేత్తో నడపగలిగే సత్తా ఆయన సొంతం. అధిష్ఠానం సైతం తన నిర్ణయాన్ని కాదనలేని వాతావరణాన్ని ఆయన సృష్టించుకున్నారు. ఈ ఎన్నికల్లోనూ డీకే శివకుమార్తో సీఎం విషయంలో పోటీ ఉన్నా, ఐక్యంగా పనిచేసి పార్టీని గెలిపించడంలో రికార్డు విజయాన్ని సాధించడంలోనూ సిద్ధూ కీలక పాత్ర పోషించారు. దీంతో ప్రజలతో పాటు పార్టీ అధిష్ఠానం మదిని గెలుచుకున్న సిద్ధూనే సీఎం పీఠం వరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్