Telangana News: కేసీఆర్, జగన్ కలిసి తెలంగాణను నిండా ముంచారు: రేవంత్రెడ్డి
రాష్ట్రానికి 8 ఏళ్లలో తెరాస ప్రభుత్వం చేసింది శూన్యం అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. గ్రామ సమస్యలపై పోరాటమే లక్ష్యంగా వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మన ఊరు-మన పోరు’ బహిరంగ సభలో రేవంత్రెడ్డి మాట్లాడారు....
పరిగి (వికారాబాద్): రాష్ట్రానికి 8 ఏళ్లలో తెరాస ప్రభుత్వం చేసింది శూన్యం అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. గ్రామ సమస్యలపై పోరాటమే లక్ష్యంగా వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మన ఊరు-మన పోరు’ బహిరంగ సభలో రేవంత్రెడ్డి మాట్లాడారు. తెలంగాణను 8 ఏళ్ళుగా పాలిస్తున్న కేసీఆర్.. బంగారు తెలంగాణ చేస్తున్నామని చెప్పి కబంధ హస్తాల్లో బంధించారని విమర్శించారు. అభివృద్ధి కోసమంటూ తెరాసలో చేరిన వారు ఏం అభివృద్ధి చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్, జగన్ కలిసి తెలంగాణను నిండా ముంచారన్నారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాల కోసం తెలంగాణను సాధించుకుంటే.. ఇప్పుడు నీళ్లు ఏపీకి, నిధులు గుత్తేదారులకు, నియామకాలు కేసీఆర్ ఇంట్లో మాత్రమే జరిగాయని ఆరోపించారు.
‘‘ఈ ప్రాంతానికి రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తెచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి జీవో ఇచ్చారు. ప్రాణహిత ప్రాజెక్టును చేవెళ్లకు రాకుండా అడ్డుకున్నది కేసీఆర్ కాదా?యాదగిరి గుట్టలో ప్రమాణం చేసి చెవుతారా కేసీఆర్..?గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను ఏ దేవుడు పాలిస్తున్నాడు. ఈ ప్రాంతాన్ని ఏ దెయ్యం పాలిస్తుంది. పాలమూరు-రంగారెడ్డిని ఆపుతామని ఎన్జీటీలో అఫిడవిట్ ఇచ్చారు. మూడేళ్ళ కిందనే పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేసి ఉంటే ఇవాళ ఇలా గొంతులు ఎండేవా? ఇప్పుడేమో దేశానికి ప్రధాని చేయమంటన్నారు. రాష్ట్ర ప్రజలు ఇకపై కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. కేసీఆర్ యాసంగి వడ్లు కొనకపోతే ఊరుకునేది లేదు’’ అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇక్కడ అత్యల్ప ఓటింగ్.. మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?