Congress President Poll: ఖర్గే - థరూర్ మధ్యే పోటీ.. మూడో నామినేషన్ తిరస్కరణ
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు పోటీ ఖరారైంది. ఈ పదవికి పోటీ చేసిన ఝార్ఖండ్ మాజీ మంత్రి కె.ఎన్.త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురైంది.
దిల్లీ: కాంగ్రెస్ (Congress) అధ్యక్ష ఎన్నికకు పోటీ ఖరారైంది. ఈ పదవికి సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) , ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor)తో పాటు ఝార్ఖండ్ మాజీ మంత్రి కె.ఎన్.త్రిపాఠి నామపత్రాలు సమర్పించగా.. వీరిలో త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఖర్గే - థరూర్ మధ్యే పోటీ నెలకొంది. అధ్యక్ష పదవికి ముగ్గురు అభ్యర్థులు మొత్తం 20 నామినేషన్ సెట్లను సమర్పించారు. ఇందులో ఖర్గే 14, థరూర్ 5, త్రిపాఠి ఒక నామినేషన్ వేశారు. వీటిని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం శనివారం పరిశీలించింది. సంతకాల్లో లోపాల కారణంగా నాలుగు పత్రాలను తిరస్కరించినట్లు పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు. ఇందులో ఒకటి త్రిపాఠి వేసిన నామినేషన్. దీంతో ఆయన పోటీ నుంచి వైదొలిగినట్లయింది.
ప్రస్తుతం పోటీలో ఖర్గే, థరూర్ ఇద్దరే ఉన్నారని తెలిపారు. నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అక్టోబరు 8 వరకు గడువు ఉందని.. ఆ తర్వాతే ఎన్నికపై మరింత స్పష్టత వస్తుందన్నారు. ఒకవేళ నామినేషన్ను ఎవరూ ఉపసంహరించుకోకపోతే అక్టోబరు 17న ఓటింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు. అక్టోబరు 19న ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఓటింగ్లో పార్టీకి చెందిన 9,100 మందికిపైగా నేతలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో శుక్రవారం అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోటీ నుంచి వైదొలగడం.. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే చివరి నిమిషంలో బరిలోకి రావడం చకచకా జరిగిపోయాయి. దీంతో అధ్యక్ష పదవికి ఖర్గే, థరూర్ మధ్య ద్విముఖ పోరు నెలకొంది. అయితే, గాంధీ కుటుంబం అండతో పాటు పార్టీలో అత్యధికుల మద్దతు ఉన్న ఖర్గేనే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.
రాజ్యసభ పదవికి ఖర్గే రాజీనామా.. రేసులో ఉన్నది వీరేనా?
మరోవైపు, అధ్యక్ష బరిలోకి దిగిన మల్లికార్జున్ ఖర్గే తన రాజ్యసభ(Rajya Sabha) పదవిని వదులుకున్నారు. ఎగువ సభలో ప్రతిపక్ష నేత పదవికి ఆయన రాజీనామా చేశారు. ఇటీవల ఉదయ్పూర్లో నిర్వహించిన ‘చింతన్ శివిర్’లో తీర్మానించినట్లుగా ‘ఒక వ్యక్తి.. ఒకే పదవి’ నిబంధనకు అనుగుణంగా తాను రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)కి తెలిపారు. ఈ మేరకు ఓ లేఖ పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ.. రాజ్యసభలో కొత్త నాయకుడిని నియమించి, ఈ నిర్ణయాన్ని రాజ్యసభ ఛైర్మన్కు తెలియజేయనున్నారు. సీనియర్ నేతలు పి.చిదంబరం, దిగ్విజయ్ సింగ్లు రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవి రేసులో ముందున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేవంత్ అధ్యక్షతన పీఈసీ సమావేశం నేడు
కాంగ్రెస్ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(పీఈసీ) సమావేశం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరగనుంది. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
చెంగిచర్ల వెళ్లిన ఎంపీ బండి సంజయ్పై కేసు
ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు బుధవారం చెంగిచర్ల వెళ్లిన ఎంపీ బండి సంజయ్పై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ జరిపించాలి: లక్ష్మణ్
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. -
కాళేశ్వరం, కేసీఆర్పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో 99.8% పోలింగ్
మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నిక గురువారం ప్రశాంతంగా ముగిసింది. -
6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏప్రిల్ 6వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని.. దీనికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. -
రెండో విడత నామినేషన్లకు శ్రీకారం
లోక్సభ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఈ విడతలో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 సీట్లకు వచ్చే నెల 26వ తేదీన పోలింగ్ జరగనుంది. -
మమతకు మృత్యుఘంటిక మోగుతోంది
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మృత్యుఘంటిక మోగడం మొదలైందని తమ్లుక్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్య సరికొత్త దుమారానికి కారణమైంది. -
భాజపా మ్యానిఫెస్టో అంశాలపై చర్చ
భాజపా మ్యానిఫెస్టోలో తెలిపిన అంశాలపై ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చర్చించింది. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నేతృత్వంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశమైంది. -
పెండింగ్ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకుగాను ఇప్పటివరకు 13 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ను ఆర్థికంగా కుంగదీయడానికే బ్యాంకు ఖాతాల స్తంభన
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ను ఆర్థికంగా కుంగదీయడానికి ఆదాయ పన్ను కట్టలేదనే సాకుతో బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాతా పాల్ ఆరోపించారు. -
రూ. 700 కోట్ల ఆస్తి.. ఒక్క వాహనమూ లేదు
కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ.700 కోట్లుగా ప్రకటించారు. -
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్