UP Elections: యూపీలో సమాజ్‌వాది పార్టీకే మా మద్దతు..

ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీకి తమ మద్దతు ఇస్తున్నట్లు రాష్ట్రీయ జనతా దల్‌(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వెల్లడించారు. గురువారం యూపీ తొలి దశ ఎన్నికలు జరగనున్న వేళ అధికార పార్టీ భాజపాపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ పాలన

Published : 10 Feb 2022 01:43 IST

పట్నా: ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు రాష్ట్రీయ జనతా దల్‌(ఆర్జేడీ) అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వెల్లడించారు. గురువారం యూపీ తొలి దశ ఎన్నికలు జరగనున్న వేళ అధికార పార్టీ భాజపాపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ పాలన దేశంలో అంతర్యుద్ధానికి దారి తీస్తోందని వ్యాఖ్యానించారు. 

‘‘యూపీలో సమాజ్‌వాది పార్టీకే మా మద్దతు ఉంటుంది. భాజపా తీరు చూస్తుంటే ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమనిపిస్తోంది. భాజపా నేతలు దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం గురించి మాట్లాడట్లేదు. కేవలం గతంలో జరిగిన అల్లర్లు, అయోధ్య.. వారణాసి.. అంటూ ఆలయాల గురించి మాట్లాడుతున్నారు. 75 ఏళ్ల కిందట ఆంగ్లేయుల్ని భారతీయులు దేశం వదిలి పారిపోయేలా చేశారు. కానీ, ఆ బ్రిటీష్‌ వాళ్లు మళ్లీ భాజపా రూపంలో దేశంలో చొరబడి విభజించు.. పాలించు సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారు. ప్రధాని మోదీ పాలన చూస్తుంటే దేశం అంతర్యుద్ధం దిశగా వెళ్తున్నట్లుంది’’అని తీవ్ర విమర్శలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని