Uddhav Thackeray: నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడే ఆ కుట్రకు ప్లాన్: ఉద్ధవ్
శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray)సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆస్పత్రిలో చేరి కదల్లేని స్థితిలో ఉన్న సమయంలోనే తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలకు ప్రణాళికలు ......
ముంబయి: శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray)సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆస్పత్రిలో చేరి కదల్లేని స్థితిలో ఉన్న సమయంలోనే తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలకు ప్రణాళికలు జరిగాయన్నారు. శివసేన నుంచి శిందే వర్గం తిరుగుబాటు నేపథ్యంలో తలెత్తిన పరిణామాలతో ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తర్వాత తొలిసారి తమ అధికార పత్రిక ‘సామ్నా’ ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం ఏక్నాథ్ శిందే (Eknath Shindhe) వర్గంతో పాటు భాజపాలపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆస్పత్రిలో తాను కదలలేని స్థితిలో ఉన్న సమయంలోనే పన్నాగం రచించారని.. తన శరీరం కదలలేని స్థితిలో ఉన్నప్పుడు వారి కదలికలు చురుగ్గా సాగాయన్నారు. ఒకవేళ తాను శిందేను సీఎంని చేసినా సరే అతడి ఆలోచనలు దుర్మార్గమైనవేనంటూ విరుచుకుపడ్డారు. వాళ్లను నమ్మడమే తాను చేసిన పెద్ద తప్పన్నారు. తన తండ్రి పేరుతో ప్రజలను ఓట్లు అర్జించవద్దని శిందే వర్గానికి సూచించారు. కుళ్లిపోయిన ఆకులు చెట్టు నుంచి రాలిపోవాల్సిందేనని.. ఆ చెట్టు నుంచి సర్వస్వం పొందినవారే చివరకు దాన్ని వదలేస్తున్నారంటూ శిందే వర్గాన్ని ఉద్దేశించి ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. సామాన్యుల నుంచే అసాధారణ నేతలను తయారు చేస్తామన్నారు. అలాగే, మహారాష్ట్రలో ఏక్నాథ్ శిందేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భాజపాపైనా విరుచుకుపడ్డారు. 2019లో తన డిమాండ్లను అంగీకరించి ఉంటే భాజపాకు ఎంతో గౌరవంగా ఉండేదన్నారు. భాజపా ఇప్పుడేం చేసింది.. 2019లో అదే చేసి ఉంటే గౌరవప్రదంగా సాగడంతో పాటు వాళ్లు ఇప్పుడు అదనంగా ఖర్చు చేసిన కోట్ల రూపాయలు సైతం మిగిలేవన్నారు.
మహారాష్ట్రకు దిల్లీయే వెన్నుపోటు పొడిచిందన్న ఉద్ధవ్.. ఆదుకున్నవారినే అంతం చేస్తున్నారంటూ కేంద్రాన్ని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. హిందువుల మధ్య ఐక్యతను దెబ్బకొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. హిందుత్వలో మరో భాగస్వామి ఉండకూడదన్న ఉద్దేశంతోనే శివసేనను అంతం చేయాలని చూస్తున్నారని.. ఠాక్రేల నుంచి శివసేనను వేరు చేయాలనుకొంటున్నారని ఉద్ధవ్ ఆరోపించారు. మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ల సారథ్యంలో 2019లో ఏర్పాటైన మహా వికాస్ అఘాడీ సర్కార్ ప్రయోగం తప్పయితే ప్రజలే తమకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవాళ్లని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
‘కృష్ణుడి గోపికను నేనే’: హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్