Andhra News: పవన్‌ను టార్గెట్‌ చేసుకొని జనసైనికులను రెచ్చగొట్టారు: నారాయణ

విశాఖలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్వహించాలనుకున్న ‘జనవాణి’ కార్యక్రమాన్ని అడ్డుకొని అనవసర రగడ సృష్టించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. పవన్‌ను లక్ష్యంగా చేసుకొని జనసైనికులను రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 17 Oct 2022 16:42 IST

అమరావతి: విశాఖలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్వహించాలనుకున్న ‘జనవాణి’ కార్యక్రమాన్ని అడ్డుకొని అనవసర రగడ సృష్టించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. పవన్‌ను టార్గెట్‌ చేసుకొని జనసైనికులను రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో వైకాపా నేతలు చేపట్టిన ‘విశాఖ గర్జన’కు ఎలాంటి ఆటంకాలు సృష్టించని పోలీసులు.. జనసేన ‘జనవాణి’ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని ఆక్షేపించారు. అమరావతి విషయంలో సీఎం జగన్ మాట తప్పి మోసం చేశారని.. దున్నపోతు మీద వర్షం పడిన చందంగా‌ జగన్ పాలన సాగుతోందని నారాయణ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు