Rivaba: గుజరాత్ ఎన్నికలూ టీ20లాగే.. నా భార్యకు మద్దతుగా నిలవండి: రవీంద్ర జడేజా
గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక(Gujarat Assembly polls)ల్లో తన భార్య రివాబా(Rivaba) పోటీ చేయడంపై క్రికెటర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) స్పందించారు.
జామ్నగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక(Gujarat Assembly polls)ల్లో తన భార్య రివాబా(Rivaba) పోటీ చేయడంపై క్రికెటర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) స్పందించారు. ఈ ఎన్నికల్లో భాజపా తరఫున జామ్నగర్ (నార్త్) సీటు నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అడుగుజాడల్లో ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. సోమవారం జామ్నగర్లో రివాబా నామినేషన్ వేయడానికి ముందు నిర్వహించిన ఓ కార్యక్రమంలో రవీంద్ర జడేజా మాట్లాడారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రివాబా మున్ముందు అన్నీ నేర్చుకుంటారన్నారు. ఇందులో పురోగతి సాధిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. రివాబాది సహాయపడే స్వభావమని.. ఎప్పుడూ ప్రజలకు సాయం చేయాలనుకుంటుందని తెలిపారు. అందుకే ఆమె రాజకీయాల్లోకి వచ్చారన్నారు. మరోవైపు, సోమవారం రివాబా తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా.. ఆదివారం రవీంద్ర జడేజా తన భార్యకు మద్దతుగా ఓ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘గుజరాత్ ఎన్నికలు వచ్చేశాయి.. ఇవి టీ20 మ్యాచ్ లాంటివే. నా భార్య భాజపా టిక్కెట్పై రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నారు. సోమవారం నామినేషన్ వేస్తున్నారు. జామ్ నగర్ ప్రజలు, క్రికెట్ అభిమానులు ఆమెకు మద్దతుగా నిలవాలి’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి