Politics: ‘కెప్టెన్’ను మార్చాల్సిందే.. పంజాబ్ కాంగ్రెస్లో పాత సీన్ రిపీట్!
పంజాబ్ అధికార కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది..! హైకమాండ్ రాజీ ఫార్ములా నేపథ్యంలో గతకొంత కాలంగా....
చండీగఢ్: పంజాబ్ అధికార కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది..! హైకమాండ్ రాజీ ఫార్ములా నేపథ్యంలో గతకొంత కాలంగా అమరీందర్ సింగ్ - నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ వర్గాల మధ్య నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా మళ్లీ భగ్గుమన్నాయి. ఇటీవల సిద్ధూ నియమించుకున్న సలహాదారులు పాకిస్థాన్, కశ్మీర్ అంశాలపై వివాదాస్పద కామెంట్లు చేయడంతో అమరీందర్ సింగ్ వారిని టార్గెట్ చేయడం వల్ల తాజాగా వివాదం తెరపైకి వచ్చింది. కెప్టెన్ అమరీందర్సింగ్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కొందరు పట్టుబడుతుండగా.. సిద్ధూ సలహాదారులపై చర్యలు తీసుకోవాలని ఇంకొందరు డిమాండ్ చేయడంతో కథ మళ్లీ మొదటికే వచ్చినట్లయింది.
ముగ్గురు మంత్రులతో పాటు 23 మంది ఎమ్మెల్యేలు అమరీందర్ సింగ్కు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ఇదే అంశంపై పార్టీ హైకమాండ్ను మరోసారి కోరతామని వారు చెబుతున్నారు.‘‘కెప్టెన్ను మార్చాలి.. లేకపోతే కాంగ్రెస్ బతికిబట్ట కట్టలేదు’’అని కేబినెట్ మంత్రి త్రిప్ట్సింగ్ భజ్వా వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలుస్తామని తెలిపారు. మరోవైపు, అమరీందర్ సింగ్ మద్దతుదారులైన ఐదుగురు మంత్రులు, ఒక ఎమ్మెల్యే మాత్రం సిద్ధూ సలహాదారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో నేతల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ రాజీ ఫార్ములా కుదుర్చిన కొన్ని వారాల వ్యవధిలోనే అమరీందర్ సింగ్ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు పట్టుబట్టడం ఇది రెండోసారి కావడం గమనార్హం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున కెప్టెన్ను మార్చే అవకాశం లేకపోవడంతో సిద్ధూకి ఇటీవల పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చి రాజీ కుదుర్చిన విషయం తెలిసిందే.
పంజాబ్లో ఈసారి రాజకీయ పరిస్థితులు గత ఎన్నికలకు భిన్నంగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-అకాలీదళ్ కలిసి పోటీ చేయగా.. ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వ్యవసాయ చట్టాలతో ఆ రెండు పార్టీల మధ్య పొసగడంలేదు. అలాగే, ఈసారి పంజాబ్లో పాగా వేయాలన్న లక్ష్యంతో ఆప్ జోరుగా పావులు కదుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పంజాబ్లో అధికార పార్టీలో కీలక నేతల వ్యవహార శైలి, వారి మధ్య ఎప్పటికప్పుడు బయటపడుతున్న విభేదాలు కాంగ్రెస్కు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్