Congress: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక భేటీ రేపే
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఆదివారం సాయంత్రం 4గంటలకు.....
దిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఆదివారం సాయంత్రం 4గంటలకు దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సభ్యులు భేటీ కానున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం ఎదుర్కొంది. పంజాబ్లో అధికారం కోల్పోవడంతో పాటు ఇతర నాలుగు రాష్ట్రాల్లోనూ పేలవమైన ప్రదర్శనే కనబరిచింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పార్టీ పనితీరును సమీక్షించేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఘోరంగా పరాజయం పాలైన నేపథ్యంలో జరగబోయే ఈ కీలక భేటీలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా సంస్థాగత, నాయకత్వ మార్పును బలంగా కోరుతున్న జీ-23 నేతలు నిన్న దిల్లీలో మాజీ ఎంపీ గులామ్ నబీ ఆజాద్ నివాసంలో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఎంపీలు ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, మనీశ్ తివారీ తదితరులు హాజరైన ఈ భేటీలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరుతో పాటు తమ భవిష్యత్తు వ్యూహంపైనా వీరు చర్చించినట్టు సమాచారం. సీడబ్ల్యూసీ భేటీకి ముందు జీ23 నేతలు ప్రత్యేకంగా భేటీ కావడం ఆసక్తి రేపుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!