Congress: కాంగ్రెస్లో కోవర్టులు.. వారితోనే పార్టీకి తీవ్ర నష్టం: దామోదర రాజనర్సింహ
తెలంగాణ కాంగ్రెస్లో కొత్త కమిటీ చిచ్చు తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే భట్టి విక్రమార్క, కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజాగా మరో సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తన ఆవేదనను వెళ్లగక్కారు. పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకి న్యాయం జరగడం లేదని ఆక్షేపించారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో కొత్త కమిటీల చిచ్చు తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి కొండా సురేఖ తదితరులు అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజాగా మరో సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తన ఆవేదనను వెళ్లగక్కారు. పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకి న్యాయం జరగడం లేదని ఆక్షేపించారు. హైకమాండ్ను గౌరవిస్తామని.. కానీ ఆత్మగౌరవాన్ని మించింది ప్రపంచంలో ఏదీ లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దామోదర రాజనర్సింహ మాట్లాడారు.
సమయం వచ్చినపుడు ఆ పేర్లు బయట పెడతాం..
‘‘పార్టీ పదవుల విషయంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు అన్యాయం జరిగింది. జిల్లాల వారీగా పార్టీ నాయకుల పనితీరును అంచనా వేసిన దాఖలాలు లేవు. విభేదాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతంగా జరిగింది. కోవర్టులు ఉండటం వల్లే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోంది. వారికి పార్టీలోని అగ్రనేతలు ఎందుకు మద్దతుగా ఉంటున్నారు? కోవర్టులని తెలిపే ఆధారాలు ఉన్నాయి.. అవి కూడా చూపించాం. సమయం వచ్చినపుడు ఆ పేర్లు బయటపెడతాం. పదవులు ఇవ్వొద్దని మేం అనడం లేదు. ఇచ్చేవాళ్లకి అర్హత ఉందో లేదో విశ్లేషణ, అధ్యయనం చేశాక ఇవ్వాలని మాత్రమే చెప్తున్నాం.
పార్టీలో ప్రక్షాళన జరగాలి
కాంగ్రెస్ మాకు మాతృ పార్టీ. దాన్ని కాపాడుకోవాలనే ఆశతో ఉన్నాం. పదవులు ఉన్నా లేకున్నా ఆత్మగౌరవంతో బతుకుతాం. మా అందరిదీ ఒకటే విజ్ఞప్తి.. కమిటీల ఏర్పాటులో జరిగిన తప్పులను సవరించాలి. కాంగ్రెస్లో ప్రక్షాళన జరగాలి. లేకపోతే భవిష్యత్లో నష్టపోవాల్సి వస్తుంది. నిరుత్సాహ పరిచేందుకు ఇలా మాట్లాడటం లేదు.. ఇవి వాస్తవాలు. ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా’’ అని దామోదర రాజనర్సింహ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM