Congress Vs SP: కూటమిపై కొట్లాట..కాంగ్రెస్ వద్దు.. మేం లేకుండా ఎలా?
భాజపా (BJP), కాంగ్రెస్ (Congress)కు సమదూరం పాటించాలని గతంలో చెప్పిన ఎస్పీ (Samajwadi Party) అధినేత అఖిలేశ్ యాదవ్ స్వరం మార్చినట్లు కనిపిస్తోంది. పొత్తుల అంశంలో ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై కాంగ్రెస్ స్వయంగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు (General Elections) సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి రాజుకుంటోంది. భాజపా (BJP)తోపాటు కాంగ్రెస్ (Congress)కు కూడా సమదూరం పాటించాలని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh yadav) నిర్ణయించారు. రెండు రోజుల క్రితం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata banerjee) తో సమావేశం అనంతరం కూడా ఇదే విషయాన్ని చెప్పారు. భాజపాను ఓడించేందుకు తృణమూల్ వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు. తాజాగా ఇదే అంశంపై కోల్కతాలో మరోసారి స్పందించిన ఆయన.. రానున్న ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై కాంగ్రెస్ స్వయంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఓ వైపు కాంగ్రెస్కు దూరంగా ఉంటామని చెబుతూనే.. ఆ పార్టీ నిర్ణయాన్ని బట్టి తమ తర్వాతి అడుగులు ఉంటాయని పరోక్షంగా చెప్పారు.
మరోవైపు కూటమి ఏర్పాటు విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కూడా స్పందించారు. కాంగ్రెస్ లేకుండా ఏ కూటమిని ఏర్పాటు చేసినా అది వ్యర్థమే అవుతుందని పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఒకవేళ ప్రతిపక్ష పార్టీలన్నీ కూటమిగా ఏర్పడితే కాంగ్రెస్ అందులో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పిన ఆయన.. పొత్తుల గురించి మాట్లాడేందుకు చాలా సమయం ఉందని అన్నారు. ‘ఎన్నో కూటమలు వస్తుంటాయ్.. పోతుంటాయ్..కానీ బలమైన కూటమి ఏర్పడాలంటే అందులో కాంగ్రెస్ కచ్చితంగా ఉండాల్సిందే’ అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.
అమేథీలో పోటీ చేస్తాం
మరోవైపు గాంధీ కుటుంబీకులకు కంచుకోటగా ఉన్న అమేథీ నుంచి ఈసారి సమాజ్వాదీ పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టే అవకాశముందని అఖిలేశ్ యాదవ్ హింట్ ఇచ్చారు. 1996 నుంచి ఈ స్థానానికి ఎస్పీ ప్రాతినిధ్యం వహించడం లేదు. 2019 ఎన్నికల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేథీ నుంచి రాహుల్ గాంధీపై విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి మరో కంచుకోటగా ఉన్న రాయ్బరేలీకి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఈ రెండు స్థానాలకు గతంలో అభ్యర్థులను నిలబెట్టని సమాజ్వాదీ పార్టీ.. కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తుండేది. అయితే, ఎస్పీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, అందువల్ల ఈ స్థానాల్లో ఈసారి కచ్చితంగా అభ్యర్థులను నిలబెట్టాలని కార్యకర్తలను నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోందని అఖిలేశ్ చెబుతున్నారు. సమయం వచ్చినప్పుడు, పార్టీ కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు.
అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు భాజపా
ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్షాల నేతలపై కేంద్రం సీబీఐ, ఈడీ,ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలను ఉసిగొల్పుతోందని అఖిలేశ్ గత కొంతకాలంగా విమర్శిస్తున్నారు. వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లను దర్యాప్తు పేరుతో ఇబ్బందులకు గురి చేస్తోందన్న ఆయన... దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియానే అందుకు ఉదాహరణ అని చెప్పారు. భాజపాకి రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించిన ఆయన.. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పదని అన్నారు. గతంలో కాంగ్రెస్కు పట్టిన గతే కాషాయ పార్టీకి కూడా పడుతుందని చెప్పారు. రాజకీయ అవసరాల కోసం గతంలో కాంగ్రెస్ కూడా ఇలాగే దర్యాప్తు సంస్థలను వినియోగించుకుందన్న అఖిలేశ్.. ఇప్పుడు భాజపా కూడా అదే పని చేస్తోందని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్టీ నిర్ణయం శిరోధార్యం: దేవినేని ఉమా
పార్టీ తీసుకున్న నిర్ణయం శిరోధార్యమని, చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు పనిచేస్తానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
రేపు నామినేషన్ వేయనున్న పవన్కల్యాణ్
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఈ నెల 23 (మంగళవారం)న నామినేషన్ దాఖలు చేయనున్నారని ఆ పార్టీ నియోజకవర్గ ఎన్నికల కమిటీ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. -
వివేకా హత్య కేసుపై మాట్లాడొద్దంటే ఎలా?
ప్రజాస్వామ్య దేశంలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడకుండా న్యాయస్థానాలు రాజకీయ పార్టీలకు ఆంక్షలు విధించడం సరికాదని, దీన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు. -
సొమ్ములిచ్చి.. జనాన్ని తెచ్చి!.. జగన్ బస్సు యాత్రకు నేతల ఆపసోపాలు
విశాఖలో ఆదివారం సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమంది. డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు పంచి మరీ కొన్ని కూడళ్ల వద్ద జనాలను నింపాల్సి వచ్చింది. -
ఏ ముఖం పెట్టుకొని ఉత్తరాంధ్రకు వస్తున్నారు?
‘విశాఖ స్టీల్ప్లాంట్కు చెందిన వేల ఎకరాలను అమ్మేయాలని చెప్పి, దాన్ని అంపశయ్య మీదకు చేర్చిన సీఎం జగన్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని విశాఖకు వస్తున్నారు? నగరాన్ని గంజాయికి, డ్రగ్స్కు అడ్డాగా మార్చారు. -
శ్రీశైలం క్షేత్ర పరిధిలో.. ఎన్నికల ప్రచారంపై అధికారుల అభ్యంతరం
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో వైకాపా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆదివారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. -
సొమ్ముతో ప్రచార సోకులు!
సీఎం జగన్ బస్సు యాత్ర కోసం ఆదివారం సాయంత్రం విశాఖలోని అక్కయ్యపాలెం 80 అడుగుల రహదారి వద్ద జనసమీకరణ చేశారు. -
బాబ్బాబు.. వైకాపా వీడొద్దయ్యా!
మేమంతా సిద్ధం అంటూ జగన్ బస్సు ఎక్కి భీమిలి వస్తుంటే.. ‘మేమంతా సిద్ధమే తెదేపాలోకి వెళ్లేందుకు’ అంటూ ఆనందపురం మండలం కుసులువాడ గ్రామస్థులు మూకుమ్మడిగా సైకిలెక్కారు. -
ఉద్యోగులను చూసి వణికిపోతున్న జగన్
ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ ఓట్లను తగ్గించేందుకు వైకాపా సర్కారు కుట్రలు చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీ పర్చూరి అశోక్బాబు ఆరోపించారు. -
ఆర్జేడీలో చేరిన బిహార్లోని ఎన్డీయే ఏకైక ముస్లిం ఎంపీ
బిహార్కు చెందిన ఎల్జేపీ లోక్సభ సభ్యుడు మహబూబ్ అలీ కైసర్ ఆదివారం ఆర్జేడీలో చేరారు. ఆ రాష్ట్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయేకు చెందిన ఏకైక ముస్లిం పార్లమెంటు సభ్యుడు మహబూబ్ అలీ కావడం గమనార్హం. -
హెచ్సీయూలో ఏబీవీపీ దాడులపై విచారణ జరపాలి: తమ్మినేని
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో ఏబీవీపీ నాయకత్వంలో వారం రోజులుగా దాడులు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్’ వ్యవస్థ ధరనూ కుదించిన టెస్లా
-
కోర్సు ఎందుకు.. హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేయండి: సుప్రీం ఆగ్రహం
-
ఏఐకి డేటా కంటే విలువైనది ఇదే.. మార్క్ జుకర్బర్గ్ అంచనా!
-
కవితకు బెయిల్ ఇవ్వొద్దు: సీబీఐ
-
అతడో ‘లెర్నింగ్ మెషిన్’.. గుకేశ్పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
-
వరుస ఓటములతో డీలా.. బెంగళూరుకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా..?