Uma Bharati: నేనలా మాట్లాడి ఉండాల్సింది కాదు: ఉమాభారతి
ప్రభుత్వ అధికార వ్యవస్థ ఓ మిథ్య.. అధికారులు ఉన్నది రాజకీయ నేతల చెప్పులు మోయడానికేనంటూ తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల భాజపా సీనియర్ నేత...
భోపాల్: ప్రభుత్వ అధికార వ్యవస్థ ఓ మిథ్య.. అధికారులు ఉన్నది రాజకీయ నేతల చెప్పులు మోయడానికేనంటూ తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు తననే ఎంతగానో బాధ పెట్టాయన్నారు. తాను అలా మాట్లాడి ఉండాల్సిందికాదని ఆవేదన చెందారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్కు లేఖ రాసిన ఉమాభారతి.. తాను వాడే భాషను మరింతగా మెరుగుపరుచుకుంటానని పేర్కొన్నారు.
శనివారం కొందరు ఓబీసీ నేతలు భోపాల్లో తన నివాసానికి వచ్చి కలిసిన సందర్భంగా బ్యూరోక్రసీపై ఉమాభారతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో సోమవారం సామాజిక మాధ్యల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్నేత దిగ్విజయ్సింగ్ తీవ్రంగా స్పందించారు.ఆ భాష తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఇందుకు గాను ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో మంగళవారం ఉమాభారతి దిగ్విజయ్ సింగ్కు లేఖ రాశారు. ‘‘నా సొంత వ్యాఖ్యలే నన్ను గాయపరుస్తున్నాయి. తీవ్ర పదజాలం వాడొద్దని నేను మీకు పదేపదే చెప్పేదాన్ని. ఇప్పట్నుంచి నేను నా భాషను మెరుగుపరుచుకుంటాను. మీరూ అలా చేయగలిగితే చేయండి’’ అని లేఖలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా