Arvind Kejriwal: కేజ్రీవాల్ ప్రసంగిస్తుండగా మోదీకి మద్దతుగా నినాదాలు.. !
దిల్లీ (Delhi)లో ఓ యూనివర్శిటీ ప్రారంభోత్సవంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రసంగిస్తుండగా.. సభలో ఉన్న కొందరు వ్యక్తులు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. దీంతో కేజ్రీవాల్ కొద్దిసేపు తన ప్రసంగాన్ని నిలిపివేశారు.
దిల్లీ: గత కొద్ది నెలలుగా దిల్లీ (Delhi)లోని ఆప్ ( AAP) ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్లీలో ఓ యూనివర్శిటీ ప్రారంభోత్సవానికి వెళ్లిన సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు నిరసన సెగ తగిలింది. సభలో ఆయన ప్రసంగిస్తుండగా కొందరు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ప్రసంగాన్ని ఆపి, తాను చెప్పేది ఓపికతో వినాలని ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం తూర్పు దిల్లీ ప్రాంతంలో కొత్త క్యాంపస్ను ఏర్పాటు చేసింది. దీని ప్రారంభోత్సవానికి సీఎం కేజ్రీవాల్ వెళ్లారు. ఇదే కార్యక్రమానికి దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కూడా వచ్చారు.
ఇరువురు కలిసి యూనివర్సిటీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేజ్రీవాల్ ప్రసంగిస్తుండగా.. సభలో ఉన్న కొందరు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. దీంతో కేజ్రీవాల్ కొద్దిసేపు తన ప్రసంగాన్ని ఆపేశారు. అనంతరం కేజ్రీవాల్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘ఇటువంటి నినాదాలు చేయడం ద్వారా విద్యావ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అనుకుంటే.. అది 70 ఏళ్ల క్రితమే జరిగేది. మిమ్మల్ని చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. నేను చెప్పే మాటల్ని ఓ ఐదు నిమిషాలు ఓపికతో వినండి. ఒకవేళ నేను మాట్లాడే మాటలు మీకు నచ్చకపోతే.. మీ నినాదాలను కొనసాగించండి. నా ఆలోచనలు, విధానాలు మీకు నచ్చకపోవచ్చు. దానిపై మీ అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు. కానీ, అందుకు ఇది సరైన వేదిక కాదు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలను తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంది’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆప్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
గత కొంతకాలంగా కేంద్రానికి, దిల్లీ ప్రభుత్వానికి మధ్య వివాదం జరుగుతోంది. గత నెలలో ప్రభుత్వాధికారుల నియామకాలు, బదిలీలపై ఎన్నికైన ప్రభుత్వానికే అధికారం ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ను తుది మధ్యవర్తిగా చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది. ఆ వెంటనే తీర్పుపై సమీక్ష కోరుతూ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. అయితే, కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆప్కు మద్దతు తెలపాలని కోరుతూ సీఎం కేజ్రీవాల్ కొద్ది రోజులుగా భాజపాయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను, విపక్ష పార్టీల అధ్యక్షులతో వరుస భేటీలు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!