Congress: దిల్లీలో కాంగ్రెస్కు మరో షాక్.. పెరిగిన ఆప్ బలం!
ఇటీవల జరిగిన దిల్లీ మున్సిపల్ ఎన్నిక(MCD Polls)ల్లో చతికిలపడిన కాంగ్రెస్(Congress)కు మరో షాక్ తగిలింది. మొత్తం 250 స్థానాలకు గాను ఆ పార్టీ కేవలం తొమ్మిది చోట్ల మాత్రమే విజయం సాధించగా.. వీరిలో ఇద్దరు కౌన్సిలర్లు ఆ పార్టీకి గుడ్బై చెప్పేశారు.
దిల్లీ: ఇటీవల జరిగిన దిల్లీ మున్సిపల్ ఎన్నిక(MCD Polls)ల్లో చతికిలపడిన కాంగ్రెస్(Congress)కు మరో షాక్ తగిలింది. మొత్తం 250 స్థానాలకు గానూ ఆ పార్టీ కేవలం తొమ్మిది చోట్ల మాత్రమే విజయం సాధించగా.. వీరిలో ఇద్దరు కౌన్సిలర్లు ఆ పార్టీకి గుడ్బై చెప్పేశారు. దిల్లీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అలీ మెహ్దీతో పాటు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు సబిలా బేగం, నజియా ఖాతూన్ శుక్రవారం ఆప్ నేత, ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీలో సీఎం కేజ్రీవాల్ చేస్తోన్న అభివృద్ధి పనులు చూసే వీరంతా తమ పార్టీలో చేరారని ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ మీడియాకు తెలిపారు. మెరుగైన దిల్లీ కోసం పనిచేసేందుకు కలిసి రావాలని భాజపా, కాంగ్రెస్లకు పిలుపునివ్వగా.. దిల్లీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఇద్దరు కౌన్సిలర్లు ఆప్లో చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
అయితే, కేజ్రీవాల్ చేస్తోన్న అభివృద్ధిని చూసే తాము ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అలీ మెహ్దీ తెలిపారు. కేజ్రీవాల్ సారథ్యంలో దిల్లీ అభివృద్ధి కోసం ఆప్ శ్రమిస్తోందన్నారు. తన ప్రాంతంలో అభివృద్ధి కోసమే ఆప్లో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. డిసెంబర్ 4న జరిగిన దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ 134 స్థానాలు గెలుచుకొని 15ఏళ్లుగా కొనసాగుతోన్న భాజపా ఏకఛత్రాధిపత్యానికి చెక్ పెట్టింది. ఈ ఎన్నికల్లో భాజపా 104 వార్డుల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ 9, స్వతంత్రులు మూడు వార్డులలో విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇద్దరు కౌన్సిలర్లు ఆప్లో చేరడంతో ఆ పార్టీ బలం 136కి చేరగా.. కాంగ్రెస్ బలం 7కి పడిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశంలో సురక్షితమైన సీటు లేదని, భవిష్యత్తులో ఆయన మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
కేరళలోని వయనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపాపై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!