Devendra Fadnavis: అవును.. మాది ‘ఈడీ’ ప్రభుత్వమే..!
మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీలో నేడు బలపరీక్ష జరిగింది. భాజపా మద్దతుతో ఏక్నాథ్ శిందే(Eknath Shinde) నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకుంది.
ఈడీకి సరికొత్త నిర్వచనం ఇచ్చిన ఫడణవీస్
ముంబయి: మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీలో నేడు బలపరీక్ష జరిగింది. భాజపా మద్దతుతో ఏక్నాథ్ శిందే(Eknath Shinde) నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకుంది. అయితే బలపరీక్ష(Trust Vote) జరుగుతోన్న సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ‘ఈడీ.. ఈడీ’ అంటూ నినాదాలు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) దర్యాప్తులకు బయపడే శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినట్లు ఠాక్రే వర్గం మొదటినుంచి ఆరోపిస్తోంది. కాగా, దీనికి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్(Devendra Fadnavis) కౌంటర్ ఇచ్చారు. ఈడీకి సరికొత్త నిర్వచనం ఇచ్చి విమర్శలను తోసిపుచ్చారు.
‘కొందరు దీన్ని ఈడీ ప్రభుత్వం అంటున్నారు. అది నిజమే. మాది ఏక్నాథ్-దేవేంద్ర(ఈడీ) ప్రభుత్వం. 2019 ఎన్నికలకు ముందు భాజపా-శివసేన కూటమిని ప్రజలు గెలిపించారు. కానీ మెజార్టీని మా నుంచి దూరం చేశారు. ఏక్నాథ్ శిందే వల్ల మేం మరోసారి శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. శివసైనికుడు ముఖ్యమంత్రి అయ్యారు. నా పార్టీ ఆదేశాల మేరకు నేను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. నన్ను భాజపానే ముఖ్యమంత్రిని చేసింది. ఆ పార్టీ చెప్తే నేను ఇంట్లో కూడా కూర్చుంటాను. అలాగే కొద్ది సంవత్సరాలుగా మహారాష్ట్ర నాయకత్వం ప్రజలకు అందుబాటులో లేదు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న ఇద్దరు నేతలు.. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు’ అని శిందే, తనను ఉద్దేశించి బలపరీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు.
2019 ఎన్నికల్లో భాజపా, శివసేన కలిసే ప్రజలను ఓట్లు అడిగాయి. భాజపా 106, శివసేన 55 స్థానాలు గెలుచుకున్నాయి. సీఎం పీఠంపై వచ్చిన విభేదాలతో శివసేన విరుద్ధ భావజాలం కలిగిన ఎన్సీపీ, కాంగ్రెస్తో పొత్తుపెట్టుకుంది. చివరకు అదే సేనలో చీలిక తెచ్చింది. భాజపా మద్దతుతో అసమ్మతి నేత ఏక్నాథ్ శిందే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు దారితీసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండో విడత నామినేషన్లకు శ్రీకారం
లోక్సభ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఈ విడతలో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 సీట్లకు వచ్చే నెల 26వ తేదీన పోలింగ్ జరగనుంది. -
మమతకు మృత్యుఘంటిక మోగుతోంది
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మృత్యుఘంటిక మోగడం మొదలైందని తమ్లుక్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్య సరికొత్త దుమారానికి కారణమైంది. -
భాజపా మ్యానిఫెస్టో అంశాలపై చర్చ
భాజపా మ్యానిఫెస్టోలో తెలిపిన అంశాలపై ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చర్చించింది. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నేతృత్వంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశమైంది. -
పెండింగ్ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకుగాను ఇప్పటివరకు 13 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ను ఆర్థికంగా కుంగదీయడానికే బ్యాంకు ఖాతాల స్తంభన
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ను ఆర్థికంగా కుంగదీయడానికి ఆదాయ పన్ను కట్టలేదనే సాకుతో బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాతా పాల్ ఆరోపించారు. -
రూ. 700 కోట్ల ఆస్తి.. ఒక్క వాహనమూ లేదు
కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ.700 కోట్లుగా ప్రకటించారు. -
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్