Digvijaya Singh: కేసీఆర్ అధికారంలోకి వచ్చాక హామీలను గాలికొదిలేశారు: దిగ్విజయ్
తెలంగాణ కాంగ్రెస్లో సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. అసంతృప్త నేతలతో గాంధీభవన్లో సమావేశమయ్యారు. అసంతృప్తికి గల కారణాలు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై చర్చించారు.
హైదరాబాద్: ప్రధాని మోదీ ఆర్థిక విధానాలతో పేదవాళ్లు మరింత పేదలుగా.. ధనికులు మరింత ధనవంతులుగా మారుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్లో సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన ఆయన.. అసంతృప్త నేతలతో గాంధీభవన్లో సమావేశమయ్యారు. అసంతృప్తికి గల కారణాలు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో దిగ్విజయ్ మాట్లాడారు. రాహుల్గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్రను రాష్ట్రంలో విజయవంతం చేసినందుకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగం, ధరలు బాగా పెరిగాయని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా భారాసపైనా ఆయన విమర్శలు చేశారు.
‘‘భారాసకు చెందిన ఇద్దరు ఎంపీలతో తెలంగాణ ఏర్పాటు సాధ్యమయ్యేదా? కాంగ్రెస్ లేకుండా రాష్ట్రం ఏర్పడేది కాదు. 2004లో మాట ఇచ్చి 2014లో దాన్ని నిలబెట్టుకున్నాం. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక చాలా హామీలు ఇచ్చి గాలికొదిలేశారు. కేసీఆర్కు బలం లేక కాంగ్రెస్ నాయకులను కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాలన్నింటికీ భారాస మద్దతు ఇచ్చింది. కుటుంబ పాలన, అవినీతిలో కేసీఆర్ ప్రభుత్వం మునిగింది. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి భారత్ జోడో యాత్రను ఎందుకు ఆపమంటున్నారు? కేంద్ర ప్రభుత్వం మెడికల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసిందా? లాక్డౌన్ పెడుతోందా?’’ అని దిగ్విజయ్ ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే