Congress: రాజస్థాన్లో కాంగ్రెస్కు ఊరట.. అలకమానిన ఆరుగురు ఎమ్మెల్యేలు
రాజ్యసభ ఎన్నికలకు ముందు రాజస్థాన్లో కినుక వహించిన అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎట్టకేలకు వెనక్కి తగ్గినట్లు సమాచారం....
జైపుర్: రాజ్యసభ ఎన్నికలకు ముందు రాజస్థాన్లో కినుక వహించిన అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎట్టకేలకు వెనక్కి తగ్గినట్లు సమాచారం. శనివారం రాత్రి సీఎం అశోక్ గహ్లోత్తో సమావేశమైన తర్వాత వారంతా ఉదయ్పుర్లో ఏర్పాటు చేసిన శిబిరానికి రావడానికి అంగీకరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నేడు సీఎంతో కలిసి వారు ఉదయ్పుర్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. వారి డిమాండ్ల పరిష్కారానికి హామీ లభించిన తర్వాతే వాళ్లంతా అలకమానినట్లు సమాచారం.
రాజ్యసభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ తర్జనభర్జనలు పడుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలందరినీ ఉదయ్పుర్లోని ఓ రిసార్టుకి తరలించింది. అయితే, ఓ మంత్రి సహా ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రం జైపుర్లోనే ఉండిపోయారు. తమ డిమాండ్లను నెరివేరిస్తేనే రిసార్టుకు వస్తామని వారు తేల్చి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీని కలవరపాటుకు గురిచేసింది. శనివారమే ఉదయ్పుర్లోని శిబిరాన్ని సందర్శించాల్సిన గహ్లోత్ ఆగిపోయారు. వారితో చర్చలు జరిపి బుజ్జగించడానికే ఆయన ఉండిపోయారని సమాచారం.
కాంగ్రెస్కు మొత్తం 109 మంది శాసనసభ్యుల బలం ఉంది. వీరిలో ఆరుగురు బీఎస్పీ సభ్యులు. వీరంతా కాంగ్రెస్లో విలీనమయ్యారు. బీఎస్పీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్కు చెందిన ఇద్దరు తాజాగా కినుక వహించారు. అయితే, వీరంతా కాంగ్రెస్ అభ్యర్థులకే మద్దతు ఇస్తారని.. కానీ, పార్టీపై ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు సమాచారం. రాజస్థాన్ నుంచి ముకుల్ వాస్నిక్, రణ్దీప్ సూర్జేవాలా, ప్రమోద్ తివారీలను రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ ఎంపిక చేసింది. మరోవైపు భాజపా తమ మాజీ మంత్రి ఘనశ్యామ్ తివారీని ఎంపిక చేసింది. అలాగే స్వతంత్ర అభ్యర్థి మీడియా దిగ్గజం సుభాష్ చంద్రకు మద్దతు ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!