డీఎంకేలో ఈ మార్పులేల..?
నాస్తికత్వం ఆ పార్టీ విధానం.. డేవుడంటే నమ్మని వైనం.. ఎవరెన్ని విమర్శలు చేసినా దశాబ్దాలుగా అదే సిద్ధాంతం.. మరిప్పుడు హిందువుల కోసం బోలెడన్ని వరాలు.. హిందూత్వం పార్టీలు సైతం ఆశ్చర్యపోయేలా తాయిలాలు....
నాస్తికత్వాన్ని పక్కనపెట్టి హిందూత్వానికి పెద్దపీట
ఇంటర్నెట్ డెస్క్: నాస్తికత్వం ఆ పార్టీ విధానం.. దేవుడంటే నమ్మని వైనం.. ఎవరెన్ని విమర్శలు చేసినా దశాబ్దాలుగా అదే సిద్ధాంతం.. మరిప్పుడు హిందువుల కోసం బోలెడన్ని వరాలు.. హిందూత్వం పార్టీలు సైతం ఆశ్చర్యపోయేలా తాయిలాలు.. ఇదీ తమిళనాట డీఎంకేలో వచ్చిన పెను మార్పు. ఏప్రిల్ 6న జరిగే శాసనసభ ఎన్నికల కోసం డీఎంకే ప్రకటించిన మేనిఫెస్టో అచ్చంగా ఈ మార్పునే ప్రతిబింబిస్తోంది. ఎందుకు డీఎంకే ఇంతలా మారిపోయింది? ఇది పరిస్థితులతో వచ్చిన మార్పా? లేక భాజపా హిందూత్వ ప్రచారాన్ని అడ్డుకునే వ్యూహమా?
ఆధ్యాత్మికతకు మాత్రమే కాదు భారతీయ శిల్పకళా వైభవమంతా ఇక్కడే ఉందా అనిపించేలా అపురూప అలయాలకు నెలవు తమిళనాడు. అలాంటి తమిళనాడును సుదీర్ఘ కాలం పాలించిన డీఎంకే విధానం మాత్రం నాస్తికత్వం. హిందూత్వం, లౌకికత్వం అని రాజకీయాలు నడిచే భారతదేశంలో ద్రవిడ పార్టీగా గుర్తింపు పొందిన డీఎంకేకు సుదీర్ఘ కాలంగా నాస్తికత్వం ఓ విధానం. పార్టీ వ్యవస్థాపకుడు కరుణానిధి కరుడుగట్టిన నాస్తికుడిగా గుర్తింపు పొందారు. బతికున్నన్ని రోజులు వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ పరంగానూ కరుణానిధి అదే విధానాన్ని అనుసరించారు. ద్రవిడ సిద్ధాంతానికి వ్యతిరేకమంటూ హిందూ పండగలకు కూడా శుభాకాంక్షలు చెప్పని పార్టీ డీఎంకే. ఈ పార్టీలో లక్షల మంది హిందూ నేతలు, కార్యకర్తలు ఉన్నా.. తమ మతాన్ని చాటుకునే వైఖరికి దూరంగానే ఉంటూ వస్తున్నారు.
అయితే తండ్రి మరణం తరువాత డీఎంకే పగ్గాలు అందుకున్న కుమారుడు స్టాలిన్.. డీఎంకేను ఆ విధానం నుంచి పక్కకు జరుపుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ప్రకటించిన ఆ పార్టీ మేనిఫెస్టోను పరిశీలిస్తే అచ్చంగా ఇదే గోచరిస్తుంది. హిందువులను ఆకట్టుకునేలా అనేక హామీలను ఇందులో పొందుపరిచింది. హిందూ ఆలయాలు, పవిత్ర ప్రదేశాల పునరుద్ధరణకు రూ.1000 కోట్ల కేటాయింపు, కొండ మీద ఉండే ప్రముఖ దేవాలయాల వద్ద రోప్వే ఏర్పాటు వంటి హామీలను ఇచ్చింది. తమిళనాడు నుంచి ఏటా లక్ష మంది పూరీ, బద్రీనాథ్, కేదార్నాథ్ యాత్రలకు వెళుతుండగా వారికి ఒక్కొక్కరికి రూ.25 వేల సబ్సిడీ అందజేస్తామని ప్రకటించింది. ఇవి కాకుండా అర్చకుల గౌరవ వేతనం పెంపు, ఆలయ ఉద్యోగులకు పింఛను సహా సంక్రాంతి పండగకు బోనస్ ఇచ్చే మార్గాలను అన్వేషిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. 19వ శతాబ్దం నాటి కుల వ్యతిరేక కవి రామలింగ అడిగళర్ బోధనలను ప్రచారం చేసేందుకు కడళూరు జిల్లా వడళూరులో అంతర్జాతీయ కేంద్రం ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చింది.
హిందువులను ఆకట్టుకునేలా మేనిఫెస్టోలో ఇన్ని హామీలను పొందుపర్చడం డీఎంకే చరిత్రలో ఇదే మొదటిసారి. అయితే డీఎంకే ఇంతలా మారిపోవడానికి చాలా పెద్ద కారణాలే ఉన్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రత్యర్థి అన్నాడీఎంకేతో కలిసి తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న భాజపా ప్రధాన ఆయుధం హిందూత్వం. తమిళనాడులో డీఎంకేను ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానీయకుండా చేసి ఆ రాష్ట్రంపై తమ పట్టును కొనసాగించాలని పట్టుదలతో ఉంది భాజపా. తమిళనాడులో భాజపా పోటీ చేస్తున్నది కేవలం 20 స్థానాల్లోనే అయినా.. ఆ పార్టీ బలంగా వినిపించే హిందూత్వ నినాదానికి అడ్డుకట్ట వేయాలంటే తాము ఆ మార్గంలోనే నడవాలన్నది డీఎంకే వ్యూహంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీఎంకే తమ మేనిఫెస్టోలో హిందువులను ఆకట్టుకునేలా లెక్కకు మించి హామీలను పొందుపరిచిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Tirumala: ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకే బ్రేక్ దర్శనాలు
-
Crime News
Khammam: దంత వైద్య విద్యార్థిని ఆత్మహత్య!.. మంటల్లో కాలిపోతుండగా గుర్తింపు..
-
Sports News
Lionel Messi: చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
Ts-top-news News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమినరీకి.. 15 నిమిషాల ముందే గేట్ల మూసివేత
-
Politics News
Bandi Sanjay: తెదేపా, భాజపా పొత్తు వ్యవహారం.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ts-top-news News
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్డ్ కొంత కఠినమే..