Sharad Pawar: ‘ఇండియా’లోకి అన్నాడీఎంకేను తీసుకొస్తారా..? శరద్పవార్ ఏమన్నారంటే..
ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగిన అన్నాడీఎంకేను ‘ఇండియా’ కూటమిలో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతాయా? అన్న ప్రశ్నకు శరద్ పవార్ స్పందించారు. ఈ విషయమై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మొదట డీఏంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ (MK Stalin)ను సంప్రదిస్తామన్నారు.
ముంబయి: అన్నాడీఎంకే (AIADMK).. భాజపా (BJP)తో తెగదెంపులు చేసుకుని, ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగింది. ఈ క్రమంలోనే ప్రతిపక్షాల ‘ఇండియా (INDIA)’ కూటమిలోకి అన్నాడీఎంకేను చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతాయా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే.. అన్నాడీఎంకేను ‘ఇండియా’ కూటమిలోకి తీసుకురావడమనే విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మొదట డీఏంకే (DMK) అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ (MK Stalin)ను సంప్రదిస్తామని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) చెప్పారు. తమిళనాడులో డీఏంకే అధికార పార్టీగా ఉండగా.. అన్నాడీఏంకే ప్రతిపక్షంగా ఉన్న విషయం తెలిసిందే.
ఎన్డీయే కూటమికి అన్నాడీఎంకే కటీఫ్.. పార్టీ శ్రేణుల సంబరాలు!
అన్నాడీఎంకేను ‘ఇండియా’ కూటమి కిందికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు శరద్ పవార్ బదులిస్తూ.. ‘ఇండియా కూటమిలో డీఎంకే కూడా ఒక పార్టీ. కాబట్టి.. ఆ పార్టీని సంప్రదించకుండా అన్నాడీఎంకే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోం’ అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఎన్డీయే, భాజపాతో నాలుగేళ్ల బంధాన్ని తెంచుకుంటున్నట్లు అన్నాడీఎంకే సోమవారం ప్రకటించింది. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మరోవైపు.. 2024 లోక్సభ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కొనే లక్ష్యంతో ప్రతిపక్షాలన్నీ ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో 28 పార్టీలు ఉన్నాయి.
అప్పట్లోనే మహిళలకు రిజర్వేషన్లు..
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్తోపాటు మిత్రపక్షాలు హృదయపూర్వకంగా మద్దతు పలికాయని శరద్ పవార్ పేర్కొన్నారు. కానీ, ప్రధాని మోదీ మాత్రం దీని గురించి ప్రస్తావించలేదన్నారు. గతంలో మహారాష్ట్రలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం కృషి చేసిందని గుర్తు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మహిళా బిల్లుకు మద్దతిచ్చాయని మధ్యప్రదేశ్ సభలో ప్రధాని మోదీ చెప్పిన నేపథ్యంలో శరద్ పవార్ ఈ విధంగా స్పందించారు.
తన నేతృత్వంలో మహారాష్ట్ర ప్రభుత్వం 1994లోనే స్థానిక సంస్థల్లో మహిళ రిజర్వేషన్లు తీసుకొచ్చినట్లు చెప్పారు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ చేపట్టిన విషయాన్ని శరద్ పవార్ గుర్తు చేశారు. తాను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు త్రివిధ దళాల్లో మహిళలకు 11 శాతం రిజర్వేషన్లు కల్పించామని పునరుద్ఘాటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Nara Lokesh: ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీసింది: లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. -
వర్షంలో పవార్ ప్రసంగం
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా వర్షం కురిసింది. అయితే.. దానిని లెక్కచేయకుండా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో రాహుల్కు యూపీ కోర్టు సమన్లు
కేంద్ర మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సోమవారం సమన్లు జారీ అయ్యాయి. -
Nara Lokesh: వైకాపా దోచిన డబ్బును ప్రజలకు ఇప్పిస్తాం
‘నేను తప్పుచేస్తే.. చంద్రబాబే జైలుకు పంపుతారు. ఏ తప్పూచేయలేదు కనుకే.. ధైర్యంగా రాజోలు సభలో ‘సైకో జగన్’ అని పిలవగలుగుతున్నా’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
యువగళం శబ్దానికి.. పాలకపక్షం పునాదులు కదులుతాయ్
తెదేపా యువనేత నారా లోకేశ్ రెండోవిడత యువగళం పాదయాత్ర శబ్దానికి పాలకపక్షం పునాదులు కదలడం ఖాయమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టంచేశారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. -
యువగళం.. ప్రభం‘జనం’
వేల మంది అభిమానులు.. దారిపొడవునా నీరాజనాల నడుమ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సోమవారం పునఃప్రారంభమైంది. -
సమస్యల్ని పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని కూల్చేస్తాం
సీఎం జగన్కు ఫిబ్రవరి 28 వరకు గడువు ఇస్తున్నామని, అప్పటికీ తమ సమస్యల్ని పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవంతో వైకాపా సర్కారును కూల్చేస్తామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునెయ్య హెచ్చరించారు. -
వైకాపా సామాజిక యాత్రతో ఇక్కట్లు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభ స్థానికులను ఇబ్బందులకు గురి చేసింది. -
మార్పు రాకపోతే బిడ్డల భవిష్యత్తు అతలాకుతలమే
‘ప్రజల్లో ఇప్పటికైనా మార్పు రాకపోతే వారి బిడ్డల భవిష్యత్తు అతలాకుతలమే’ అనే సందేశాన్నిచ్చేలా ఉన్న ఓ లఘుచిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. -
తాడిపత్రిలో బస్సు యాత్ర వెలవెల
అనంతపురం జిల్లా తాడిపత్రిలో సోమవారం జరిగిన వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం నుంచి స్పందన కరవైంది. సభలో కనీసం కుర్చీలు వేయకపోవడంతో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. -
మంత్రాలయంలో వైకాపాకు ఎదురుదెబ్బ
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (కేడీసీసీబి) మాజీ అధ్యక్షుడు రామిరెడ్డి తనయులు వైకాపాకు రాజీనామా చేశారు. -
నంద్యాల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా ఫరూక్
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నియమితులయ్యారు. -
అవినీతికి సహకరిస్తారనే డిప్యుటేషన్పై తీసుకొస్తున్నారా?
రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు మీ అవినీతికి సహకరించడం లేదనే కేంద్ర సర్వీసుల నుంచి నాన్ క్యాడర్ ఐఏఎస్లను డిప్యుటేషన్పై తీసుకొస్తున్నారా అని సీఎం జగన్ను తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు ప్రశ్నించారు. -
వైకాపాకు డిపాజిట్లు వస్తే మనం ఓడిపోయినట్లే..: అచ్చెన్నాయుడు
‘తెదేపా-జనసేనలు కలిశాక గోదావరి జిల్లాల్లో వైకాపాకు డిపాజిట్లు వస్తే మనం ఓడిపోయినట్లే లెక్క..’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. యువగళం పాదయాత్ర సభలో ప్రసంగించారు. -
సామాజిక సాధికార యాత్రకు జనాల తరలింపు
ఏలూరు జిల్లా కైకలూరులో మంగళవారం జరగనున్న వైకాపా సాధికార యాత్రకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణకు అధికారులు, నాయకులు కృషి చేస్తున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Musk: అప్పటి వరకు ప్రతిరోజూ ఈ ట్యాగ్ ధరిస్తా: ఎలాన్ మస్క్
-
USA: ‘ప్రార్థనా స్థలాల్లో రాజకీయాలొద్దు’.. ఖలిస్థానీల దుశ్చర్యపై ‘సిఖ్స్ ఆఫ్ అమెరికా’ ఖండన
-
Uttarakhand Tunnel: ఏ క్షణమైనా మీ వాళ్లు బయటకు.. కూలీల కుటుంబాలకు సమాచారం
-
Britain-Greek: పురాతన శిల్పాల వివాదం.. ప్రధానుల భేటీ రద్దు
-
Malla Reddy: మహేశ్బాబు ‘బిజినెస్మేన్’ చూసి ఎంపీ అయ్యా.. మల్లారెడ్డి స్పీచ్కు మహేశ్బాబు నవ్వులే నవ్వులు!
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు