దుబ్బాక: 6వ రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. తొలి ఐదు రౌండ్లలో భాజపా ఆధిక్యం ప్రదర్శించగా.. ఆరో రౌండ్‌లో తెరాసకు 353 ఓట్ల ఆధిక్యం లభించింది. ..

Updated : 10 Nov 2020 11:47 IST

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. తొలి ఐదు రౌండ్లలో భాజపా ఆధిక్యం ప్రదర్శించగా.. ఆరో రౌండ్‌లో తెరాసకు 353 ఓట్ల ఆధిక్యం లభించింది. 6వ రౌండ్‌లో తెరాసకు 4,062, భాజపాకు 3,079, కాంగ్రెస్‌కు 530 ఓట్లు పోలయ్యాయి.  ప్రస్తుతం దుబ్బాకలో ఆరు రౌండ్లు ముగిసే సరికి భాజపాకు 20,226, తెరాసకు 17,559, కాంగ్రెస్‌కు 3,254 ఓట్లు లభించాయి. ఆరు రౌండ్లు ముగిసే సరికి భాజపా ఆధిక్యం 2,667 ఓట్లు. ఇప్పటి వరకు లెక్కించిన ఆరు రౌండ్ల ఓట్లు దుబ్బాక మండలం, పురపాలక సంఘం పరిధిలోనివి. ఇంకా 17 రౌండ్ల ఓట్లు లెక్కింపు పూర్తి చేయాల్సి ఉంది.

 23 మంది అభ్యర్థులు పోటీపడిన దుబ్బాకలో విజేత ఎవరో మరి కాసేపట్లో స్పష్టం కానుంది. కొవిడ్‌-19 నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు.5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కిస్తారు. ఈవీఎంలు మొరాయించిన పక్షంలో వీవీ ప్యాట్లలోని స్లిప్పులను పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ నెల 3న జరిగిన పోలింగ్‌లో 1,64,192 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 శాతం పోలింగ్‌ నమోదైంది. తెరాస నుంచి సోలిపేట సుజాత, భాజపా నుంచి మాధవనేని రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీకి దిగిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని