Telangana News: తెరాస కార్యక్రమాల్లో ఇతర పార్టీలు ఆందోళన చేస్తే ఊరుకుంటారా?: రఘునందన్రావు
దుబ్బాక నియోజకవర్గం గుడికందులలో మినీ కూరగాయల మార్కెట్ ప్రారంభానికి వెళ్తే తెరాస నేతలు అడ్డుకున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు.
దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గం గుడికందులలో మినీ కూరగాయల మార్కెట్ ప్రారంభానికి వెళ్తే తెరాస నేతలు అడ్డుకున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. స్వయంగా తాను ఫోన్ చేసి బందోబస్తు కల్పించాలని సిద్దిపేట ఏసీపీని కోరినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. వారిపై మహిళలు తిరుగుబాటు చేశారని పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్ ఈ విషయాలను తెలిపారు. తెరాస నిర్వహించే సమావేశాల్లో ఇతర పార్టీల నేతలు ఆందోళన చేస్తే పోలీసులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. నాపై భౌతికదాడి చేసేందుకు వస్తే పోలీసులు నియంత్రించలేదని మండిపడ్డారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు డీజీపీని కలిసి పోలీసులు వ్యవహరించిన తీరును వివరించనున్నట్లు చెప్పారు.
మిరుదొడ్డి పోలీసు స్టేషన్లో తాను ఉంటే.. గేటు బయట తెరాస నేతలతో ఏసీపీ సంప్రదింపులు జరిపారని రఘునందన్ ఆరోపించారు. ఎమ్మెల్యేకు రక్షణ కల్పించలేదు కానీ.. కూల్చేసిన శిలాఫలకం కడుతుంటే 50 మంది పోలీసులు భద్రత కల్పించారని దుయ్యబట్టారు. శిలాఫలకం కూల్చిన వ్యక్తులను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదో సిద్దిపేట ఏసీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. శిలాఫలకం కూల్చిన వారిపై, తనపై దాడికి యత్నించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. అధికార కార్యక్రమానికి వెళ్ళిన తనపై శాంతి భద్రతలకు విఘాతం కలిగించానని పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని రఘునందన్ ఆక్షేపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM