Telangana News: భాజపాపై ఉన్న కోపాన్ని కేసీఆర్ రైతులపై చూపిస్తున్నారు: ఈటల రాజేందర్
భారతీయ జనతా పార్టీపై ఉన్న కోపాన్ని సీఎం కేసీఆర్ రైతాంగం మీద చూపిస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీపై ఉన్న కోపాన్ని సీఎం కేసీఆర్ రైతాంగం మీద చూపిస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. ధాన్యం సేకరణ కొత్తగా వచ్చింది కాదని.. దశాబ్దాలుగా కొనసాగుతుందని తెలిపారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజెన్సీలా పనిచేస్తుందని ఆరోపించారు. ధాన్యం పండించి పార్టీ కార్యాలయాలు, ఇళ్ల ముందు పోస్తామని సీఎం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వరి వేయొద్దంటే రైతుల పరిస్థితేంటని ప్రశ్నించారు. తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని కేంద్రం ఎక్కడా చెప్పలేదన్నారు. భాజపా అధికారంలోకి వచ్చాక ప్రతి పంటను కొనుగోలు చేస్తామని ఈటల స్పష్టం చేశారు. రాష్ట్ర రైతాంగం ప్రయోజనాల కోసం తెలంగాణ భాజపా శాఖ కృషి చేస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM