Telangana News: అసహనంతో భాజపా నాయకులపై దాడులు: తెరాసపై ఈటల ఆగ్రహం

ప్రజల్లో పలుకుబడిని కోల్పోయిన తెరాస నాయకులు అసహనంతో భాజపా నాయకులపై దాడులకు దిగుతున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. భవిష్యత్తులోనూ తెరాస నాయకులు ఇదే తరహాలో ప్రవర్తిస్తే తమ ఆగ్రహానికి గురుకాకతప్పదని ఈటల హెచ్చరించారు. ఇలాంటి...

Published : 16 Aug 2022 01:47 IST

హైదరాబాద్‌: ప్రజల్లో పలుకుబడిని కోల్పోయిన తెరాస నాయకులు అసహనంతో భాజపా నాయకులపై దాడులకు దిగుతున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. భవిష్యత్తులోనూ తెరాస నాయకులు ఇదే తరహాలో ప్రవర్తిస్తే తమ ఆగ్రహానికి గురుకాకతప్పదని ఈటల హెచ్చరించారు. ఇలాంటి నీచమైన సంస్కృతిని రాజకీయాలకు అంటిస్తే అందులోనే మాడి మసైపోతారని.. ఈ పద్ధతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. పోలీసుల అనుమతితో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్రలో దాడికి దిగడం దారుణమన్నారు. చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పని చేయడం సిగ్గుచేటన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని తెరాస నాయకులు దాడికి దిగుతున్నారని.. పోలీసులు తమ వైఖరిని మార్చుకోవాలని ఈటల సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని