Maharashtra Political Crisis: కొనసాగుతోన్న ‘మహా’ అనిశ్చితి.. శిందే కంచుకోటలో 144 సెక్షన్
మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి కొనసాగుతోంది. ఎంవీఏ కూటమి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, శివసేన అసమ్మతి నేత ఏక్నాథ్ శిందే.. తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి కొనసాగుతోంది. ఎంవీఏ కూటమి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, శివసేన అసమ్మతి నేత ఏక్నాథ్ శిందే.. తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. శిందే గువాహటిలోని ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చొని తన బలం పెంచుకుంటుండగా.. ఇప్పటికే భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలను కోల్పోయిన ఉద్ధవ్ వర్గం క్షేత్రస్థాయి కార్యకర్తలపై దృష్టి సారించింది. అలాగే ఈ రోజు మధ్యాహ్నం శివసేన జాతీయ కార్యవర్గంతో ముంబయిలో భేటీ కానున్నారు. మరోపక్క శిందే తదుపరి కార్యాచరణపై దృష్టిపెట్టారు. దానిలో భాగంగా వారుంటున్న రాడిసన్ బ్లూ హోటల్లోనే ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం నిర్వహించనున్నారు.
శిందే కంచుకోటలో నిషేధాజ్ఞలు..
ఇదిలా ఉంటే.. అసమ్మతి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు నిరసనలకు దిగుతున్నారు. శిందేతో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలున్న హోర్డింగ్లు, బోర్డులను ధ్వంసం చేసిన ఘటనలు వెలుగులోకివచ్చాయి. దీంతో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముంబయిలో బందోబస్తు చర్యలు చేపట్టారు. అలాగే శిందే కంచుకోటగా ఉన్న థానేలో పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఆ నగరం మొత్తం 144 సెక్షన్ విధించారు. కర్రలు, ఆయుధాలతో తిరగడం, పోస్టర్లు, దిష్టిబొమ్మలు తగులబెట్టడం పూర్తిగా నిషేధం. స్పీకర్లలో నినాదాలు చేయడం, పాటలు పాడేందుకు అనుమతి లేదు. ఈ నిషేధాజ్ఞలు ఈ నెల 30 వరకు అమల్లో ఉంటాయి.
ఇదిలా ఉండగా.. డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ మొత్తం 16 మంది అసమ్మతి ఎమ్మెల్యేలకు ఈరోజు నోటీసులు అందజేయనున్నారు. జూన్ 26 సాయంత్రం 5 గంటలలోపు ఎమ్మెల్యేలు తమ స్పందనను తెలియజేయాలని కోరనున్నారు. మహారాష్ట్ర శాసనసభకు భౌతికంగా హాజరు కావాలని వారికి సూచించనున్నారు. అలాగే మరో నలుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శివసేన డిప్యూటీ స్పీకర్కు పేర్లు పంపిందని సీనియర్ నేత ఒకరు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ల కోలాహలం షురూ
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల కోలాహలం ప్రారంభమైంది. రాజకీయ సందడి ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులు గురువారం ఉదయం నోటిఫికేషన్లు జారీ చేశారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం
వచ్చే సంవత్సర కాలంలో ఏదైనా జరగొచ్చని, లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి చేశా
ఓటు వేసి గెలిపించిన ఓటరు తలదించుకునేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు. -
పదేళ్లలో రాష్ట్రానికి భారాస, భాజపా చేసింది శూన్యం
గత పదేళ్లలో రాష్ట్రంలోని భారాస, కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు చేసింది శూన్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. -
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
ఇటీవల తన తల్లి మృతి నేపథ్యంలో హమీర్పుర్ సీటు తనకు ఇచ్చినా పోటీ చేసే ఉద్దేశం లేదని డిప్యూటీ సీఎం కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె