Eknath Shindhe: నాడు ఆటో నడిపారు.. ఇకపై మహారాష్ట్రను నడిపిస్తారు..
ఏక్నాథ్ శిందే (Eknath Shindhe).. నిన్న మొన్నటివరకు అందరికీ పెద్దగా పరిచయంలేని పేరు. కానీ గత తొమ్మిది రోజులుగా దేశమంతా మార్మోగుతోంది. ఉద్ధవ్ఠాక్రే (uddhav thackeray) సారథ్యంలోని....
ఆటోవాలా నుంచి సీఎం స్థాయికి.. శిందే ప్రస్థానం ఇదీ..!
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం: ఏక్నాథ్ శిందే (Eknath Shindhe).. నిన్న మొన్నటివరకు అనేకమందికి అంతగా పరిచయంలేని పేరు. కానీ గత తొమ్మిది రోజులుగా దేశమంతా మార్మోగుతోంది. ఉద్ధవ్ఠాక్రే (uddhav thackeray) సారథ్యంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని నిలువునా కూల్చడంలో చక్రం తిప్పారు. శివసేనపై తిరుగుబావుటా ఎగురవేసి ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా మూడింట రెండొంతుల మందికి పైగా ఎమ్మెల్యేలను తన వైపునకు ఆకర్షించడం ద్వారా తన రాజకీయ వ్యూహాలకు తిరుగులేదని నిరూపించుకున్నారు. రాజకీయ చాణక్యుడిగా పేరొందిన శరద్ పవార్లాంటి హేమాహేమీలు నేతలున్న మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి మరో గత్యంతరం లేక చివరకు అధికారం వదులుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు.. భాజపాను మెప్పించడం ద్వారా అనూహ్యంగా సీఎం పీఠాన్ని తానే అధిరోహించారు. ఒకప్పుడు ఆటోడ్రైవర్గా పనిచేసి దేశంలో కీలక రాష్ట్రమైన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఏక్నాథ్ శిందే రాజకీయ ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే..
(ఏక్నాథ్ శిందేకు మిఠాయి తినిపిస్తున్న గవర్నర్ కోశ్యారీ)
బతుకుదెరువు కోసం ఆటో నడిపారు..
మహారాష్ట్ర రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపేసిన ఏక్నాథ్ శిందే అట్టడుగు స్థాయి నుంచి రాజకీయాల్లో ఎదిగారు. ఆయన స్వస్థలం సతారా. బతుకుదెరువు కోసం ముంబయి శివారులోని ఠాణెకి వచ్చిన శిందే కుటుంబం అక్కడే స్థిరపడింది. ఠాణెలోని మంగళా హైస్కూల్లో 11వ తరగతి వరకు చదువుకున్న ఆయన.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కుటుంబానికి అండగా ఉండేందుకు ఆటో రిక్షా, టెంపో డ్రైవర్గా పనిచేశారు. శిందేకు ముగ్గురు కుమారులు ఉండగా.. 2000 సంవత్సరంలో జరిగిన బోటు ప్రమాదంలో ఇద్దరు కుమారులను కోల్పోయారు. అనంతరం కొన్ని నెలలపాటు తీవ్ర కుంగుబాటుకు గురైన శిందే.. తన రాజకీయ గురువు ఆనంద్ దిఘే మద్దతులో క్రియాశీల రాజకీయాల్లో బిజీ కావడంతో ఆ విషాదం నుంచి త్వరగా బయటపడగలిగారు.
ఆ ఇద్దరి ప్రభావంతోనే రాజకీయాల్లోకి..
ప్రజా ఉద్యమాల్లో చురుకునే ఉండే ఏక్నాథ్ శిందే శివసేన వ్యవస్థాపకుడు బాల్ఠాక్రే, పార్టీ ఠాణె జిల్లా ఇన్ఛార్జ్ ఆనంద్ దిఘే ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి ఠాణె శివసేన అధ్యక్షుడు ఆనంద్ దిఘే ఆయన్ను ఎంతగానో ప్రోత్సహించారు. దీంతో బాలాసాహెబ్ ఠాక్రే స్ఫూర్తితో 1980లో రాజకీయాల్లోకి చేరారు. 2001లో ఆనంద్ దిఘే మృతిచెందడంతో ఆయన వారసుడిగా ఠాణె శివసేనలో కీలక నేతగా ఎదిగారు. 1997లో తొలుత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి ఠాణె కార్పొరేటర్గా విజయం సాధించారు. ఆ జిల్లాలో జరిగే ప్రజా ఉద్యమాల్లో ముందుండే శిందే.. శివసేన అధిష్ఠానం దృష్టిలో పడడంతో అసెంబ్లీకి పోటీ చేసేందుకు అవకాశం దక్కించుకున్నారు. అలా 2004లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించిన ఆయన.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 2009లో కొపారి- పంచపఖాడి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల తర్వాత శాసనసభలో శివసేన పక్షనేత బాధ్యతలు చూడటంతో పాటు మంత్రి అయ్యారు. 2019లోనూ వరుసగా రెండోసారి శివసేన శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. అలాగే, ఉద్ధవ్ కేబినెట్లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఠాణె ప్రాంతంలో శివసేనను బలోపేతం చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా శిందే కుమారుడు శ్రీకాంత్ శిందే కూడా లోక్సభ ఎంపీగా గెలుపొందారు. ఆయన సోదరుడు ప్రకాశ్ శిందే మాత్రం కౌన్సిలర్గా కొనసాగుతున్నారు.
గతంలో సీఎం ఆశలు గల్లంతై..
2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహారాష్ట్ర రాజకీయాల్లో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భాజపాతో కలిసి పోటీ చేసిన శివసేన.. ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం పోస్టు విషయంలో తలెత్తిన విభేదాలతో ఎంతో కాలంగా ఉన్న తన మిత్రపక్షం భాజపాకు గుడ్బై చెప్పింది. ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి మహావికాస్ అఘాడీ (MVA) కూటమిగా ఏర్పడింది. ఈ కూటమి ఏర్పాటులో శిందే కూడా కీలకంగా వ్యవహరించారు. అయితే, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత శివ సైనికుడినే సీఎంను చేయాలని కూటమి భావించింది. అయితే, అప్పటికి ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా పగ్గాలు చేపట్టేందుకు సుముఖంగా లేకపోవడంతో సీఎం రేసులో ఏక్నాథ్ శిందే పేరు ప్రధానంగా వినిపించింది. కానీ, ఇందుకు ఎన్సీపీ అభ్యంతరం చెప్పడంతో చివరకు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. దీంతో శిందే ఆశలు గల్లంతయ్యాయి.
(భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్తో..)
అదను చూసి తిరుగుబావుటా..
ఆనంద్ దిఘే సారథ్యంలో ఏకనాథ్ శిందే ఎదిగారు. గురువు దిఘే తరహాలోనే ప్రజలతో సన్నిహత సంబంధాలు, వారి సమస్యలను తీర్చడం.. తదితర కార్యక్రమాలతో ఠాణె జిల్లాలో ప్రముఖ నేతగా ఎదిగారు. కేవలం ఠాణె మాత్రమే కాకుండా పాల్ఘార్ జిల్లాలోనూ ఆయన మాటే వేదం. సేనలో ప్రముఖ నేతలు నారాయణ్ రాణె, రాజ్ఠాక్రే బయటకు వెళ్లిపోయినా శిందే నేతృత్వంలోనే శివసేన కార్యక్రమాలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చేవారు. శివసేనకు పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్న శిందేకు ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి మహా వికాస్అఘాడి ప్రభుత్వాన్ని నెలకొల్పడం రుచించలేదు. దీంతో సమయం కోసం వేచి చూసిన ఆయన తిరుగుబావుటా ఎగురవేశారు. గువాహటిలోని ఓ హోటల్లో క్యాంపు రాజకీయాలు నడిపి తొమ్మిది రోజులుగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేకెత్తించారు. తనవర్గం ఎమ్మెల్యేలను నిలుపుకొంటూనే రోజురోజుకీ తన వైపు సంఖ్యా బలాన్ని పెంచుకోవడంలో సఫలీకృతమై భాజపా మెప్పు పొందారు. తద్వారా అనూహ్యంగా తానే సీఎంగా ప్రమాణస్వీకారం చేసి మహారాష్ట్రను నడిపించబోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు వైకాపా నేతలపై పోలీసులు సోమవారం కేసులు నమోదు చేశారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ
ప్రజలతో మమేకమయ్యేందుకు తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి లోకేశ్ సోమవారం ‘రచ్చబండ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ప్రధాని సభలో ఇంత భద్రతా వైఫల్యమా?
‘ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్న ప్రజాగళం బహిరంగ సభలో అడుగడుగునా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. సభలో ఎక్కడా ప్రజలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. -
జనం తోసుకుంటుంటే చోద్యం చూశారు
ప్రధాని మోదీ పాల్గొన్న బొప్పూడి ప్రజాగళం సభకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ధ్వజమెత్తారు. -
ప్రభుత్వ వెబ్సైట్లలో ఫొటోలు తొలగించాలి
ప్రభుత్వశాఖల వెబ్సైట్లలో ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉండడంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)కి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. -
ప్రధాని సభకు ఆటంకాల వెనుక జగన్ హస్తం
ప్రధానమంత్రి పాల్గొన్న ప్రజాగళం సభకు ఆటంకాలు సృష్టించడం వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందని మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. -
లక్షల మంది తరలివచ్చి కూటమిని ఆశీర్వదించారు
చిలకలూరిపేటలో భాజపా, తెదేపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వంటిది ఈ దశాబ్దంలో చూడలేదని జనం చెబుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపు చేపడితే మేలు
ఏపీలో మే 13న ఎన్నికలు ముగిశాక సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపును చేపట్టాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. -
జగన్ అరాచక పాలనకు మోదీ అండ: సీపీఐ
వైఎస్ వివేకా హత్య కేసు నిందితులను సీబీఐ ఇంతవరకు గుర్తించకపోవడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. -
కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్ యథావిధిగా జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. -
వైకాపా అధిష్ఠానానికి నగరి అసమ్మతి నేతల ఝలక్
చిత్తూరు జిల్లా నగరి సీటును మంత్రి రోజాకు కేటాయిస్తే తాము పని చేయమని వైకాపా అసమ్మతి నేతలు తెగేసి చెప్పినా, రెండ్రోజుల క్రితం ఆమె అభ్యర్థిత్వాన్నే జగన్ ఖరారు చేశారు. -
కడపలోనూ కొండలు కొల్లగొట్టేశారు...
ముఖ్యమంత్రి జగన్ సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో కొండలు, గుట్టలను వైకాపా నేతలు అయిదేళ్లుగా వరుసబెట్టి మింగేశారు. -
హిందూమతం అంతమే వారి లక్ష్యం
దేశంలో హిందూమతాన్ని, శక్తి ఆరాధనను అంతం చేసేందుకు ఇండియా కూటమి కంకణం కట్టుకుందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. -
ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి సవాంగ్ రాజీనామా చేయాలి
గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం మూడుసార్లు చేస్తే ఒక్కసారే జరిగిందంటూ ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్సవాంగ్ బుకాయించడం సిగ్గుచేటని, ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని.. తక్షణం రాజీనామా చేయాలని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. -
ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేని అసమర్థ సీఎం జగన్
జగన్రెడ్డి అయిదేళ్ల పాలనలో జలవనరుల రంగంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా రైతులకు కన్నీరు మిగిల్చారని జలవనరుల శాఖ మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. -
గెలుపే లక్ష్యంగా పని చేయాలి
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెదేపా, భాజపా అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పిలుపునిచ్చారు. -
ప్రజాగళం విజయవంతంతోసర్దుకుంటున్న జగన్ సర్కారు
చిలకలూరిపేటలో ఎన్డీఏ సభ (ప్రజాగళం) విజయవంతం కావడంతో జగన్ ప్రభుత్వం తట్టాబుట్టా సర్దుకునే పనిలో నిమగ్నమైందని భాజపా అధికార ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
వైకాపాలో చేరిన తెదేపా నేత రామచంద్రరావు
విశాఖపట్నానికి చెందిన తెదేపా నేత గంపల వెంకట రామచంద్రరావు, ఆయన భార్య సంధ్యారాణి వైకాపాలో చేరారు. సోమవారం వారు తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు. -
ఆయన మా అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేశారు
ఇటీవల భాజపాలో చేరిన సీనియర్ నేత అశోక్ చవాన్ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మహారాష్ట్రకు చెందిన ఒక సీనియర్ నేత కాంగ్రెస్ను వీడారు. ఆయన మా అమ్మతో మాట్లాడుతూ..‘సోనియాజీ.. వారితో పోరాడే శక్తి నాకు లేదు. -
ఖమ్మం, మెదక్, భువనగిరి టికెట్లకు పోటాపోటీ
రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ ఏకాభిప్రాయ దిశగా సాగుతోంది. నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు మొదటి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించించగా మిగిలిన 13 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. -
ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు
‘‘ప్రజాజీవితంలో ఓడినా, గెలిచినా ఒక్కతీరుగా ఉండాలి. మన ప్రజలు.. మన రాష్ట్రం అనే పద్ధతిలోనే ముందుకు సాగాలి’’ అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి అటు ఓటేశారని... ఇప్పుడు ప్రజలకు వాస్తవం అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు (Latest News)
-
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్దేవ్బాబాకు సుప్రీంకోర్టు సమన్లు
-
SS Rajamouli: త్వరలో షూటింగ్.. మహేశ్ మూవీపై జక్కన్న అప్డేట్
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్