Telangana News: రేవంత్.. సీఎం కేసీఆర్ మీలా లాలూచీ పనులు చేయలేదు: ఎర్రబెల్లి దయాకర్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎక్కడ అడుగు పెడితే అక్కడ పార్టీ నాశనం అవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎక్కడ అడుగు పెడితే అక్కడ పార్టీ నాశనం అవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రేవంత్ కాంగ్రెస్లోకి రాకముందు ఆ పార్టీ కొన్ని సీట్లు గెలిచిందని.. ఇప్పుడు కాంగ్రెస్ జీరో అయిందన్నారు. రాష్ట్రంలో నీచ రాజకీయాలు చేసేది ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఒక్కరైనా.. రేవంత్ మంచోడని చెప్పమనండి అని ఎర్రబెల్లి సవాల్ విసిరారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి.. విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘‘తెలంగాణ ఉద్యమాన్ని సీఎం కేసీఆర్ స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకెళ్లారు. రేవంత్లా ఎక్కడా ఎలాంటి లాలూచీ పనులు కేసీఆర్ చేయలేదు. ఉద్యమ సమయంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తెలంగాణ కోసం పోరాడితే.. రేవంత్ మాత్రం చంద్రబాబు దగ్గర కూర్చున్నారు. చెప్పాలంటే రేవంత్.. చంద్రబాబుకు ఏజెంట్గా పని చేస్తున్నారు. రేవంత్రెడ్డి.. మీరు మీ భాష మార్చుకోవాలి. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పార్టీ ఓడిపోతుంది. కేసీఆర్.. తెలంగాణను అభివృద్ధి చేసిన మహానేత. మిషన్ భగీరథ ద్వారా గ్రామగ్రామానికి తాగునీరు అందించిన ఘనత కేసీఆర్ది. ఒకప్పుడు రాష్ట్రంలో నీళ్లు, కరెంటు కోసం ధర్నాలు చేసేవారు. ఈ ఏడేళ్లలో ఎక్కడైనా నీళ్లు, కరెంటు కోసం ధర్నాలు జరిగాయా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇక్కడి పథకాలు అమలువుతున్నాయా?రైతులకు ఎదురు పెట్టుబడి ఇచ్చి కేసీఆర్ రైతులను ఆదుకుంటున్నారు. రైతుల కోసం సభ పెడుతుంటే కాంగ్రెస్ వాళ్లే అసహ్యించుకుంటున్నారు. తెలంగాణ రైతాంగాన్ని కేంద్రం ఇబ్బంది పెట్టే పనులు చేస్తుంటే.. కేంద్రంపై పోరాటం చేయకుండా విజిలెన్స్, సీబీఐ అని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. బియ్యం కొంటామని చెప్పి కేంద్రం మోసం చేస్తే కేసీఆర్ ముందుకొచ్చి కొంటున్నారు. రైతుల కోసం రూ.3, 4 వేల కోట్లు నష్టాన్ని కూడా కేసీఆర్ లెక్క చేయడం లేదు. తీరా తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనేందుకు సిద్ధపడితే అవినీతి చేశారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపిస్తున్నారు. తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతూ.. పూర్తిగా దిగజారి మాట్లాడుతున్న విపక్ష నేతల తీరును రాష్ట్ర ప్రజలు గమనించాలి’’ అని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
ఒక్క డీఎస్సీ కూడా పెట్టకుండా జగన్.. యువత భవిష్యత్తు నాశనం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. -
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రాహుల్గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. -
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్