Gehlot: ఉచిత వ్యాక్సిన్ భారతీయుడి హక్కు
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఓ వైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, కేంద్రం సరైన విధానాలను అనుసరించడం లేదనే వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా కేంద్రం తీరుపై పెదవి విరిచింది. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి వ్యాక్సినేషన్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి...
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్
జైపూర్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఓ వైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సరైన విధానాలను అనుసరించడం లేదనే వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా కేంద్రం తీరుపై పెదవి విరిచింది. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి వ్యాక్సినేషన్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉచితంగా వ్యాక్సిన్ పొందడం ప్రతి ఒక్క భారతీయుడి హక్కు అని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ వ్యాఖ్యానించారు. దేశంలో ఆరోగ్య విపత్తు తలెత్తినప్పుడు కేంద్రం అందరికీ వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకురాకపోవడం నిజంగా అన్యాయమంటూ ఆయన ట్వీట్ చేశారు. సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడు గత ప్రభుత్వాలు ఇలాగే పని చేశాయా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.
కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్లో కాంగ్రెస్ నిర్వహించిన ఓ సమావేశంలో సీఎం గెహ్లోత్ మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ అసమర్థతకు వ్యతిరేకంగా మనమంతా గళం వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రజలకు కాంగ్రెస్ నుంచి పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశంలో సురక్షితమైన సీటు లేదని, భవిష్యత్తులో ఆయన మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
కేరళలోని వయనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపాపై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్