CM Jagan-Balineni: సీఎం జగన్‌తో బాలినేని భేటీ.. నేతల మధ్య విభేదాలపై చర్చ

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైకాపా సీనియర్‌నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. 

Published : 01 Jun 2023 17:28 IST

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైకాపా సీనియర్‌నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లాలో వైకాపా నేతల మధ్య ఉన్న విభేదాలకు సంబంధించి సీఎంతో చర్చించేందుకు బాలినేని సమావేశమైనట్టు తెలుస్తోంది.

తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో పాటు ఇతర నేతలకు సంబంధించిన వ్యవహారంలో గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. తాను పార్టీ టికెట్లు ఇప్పించిన ఎమ్మెల్యేలే తనపై వివాదాలు సృష్టిస్తూ, సీఎంకు ఫిర్యాదు చేస్తున్నారని ఇటీవల ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలినేని కంటతడి పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేతల మధ్య ఉన్న విభేదాల అంశంపై సీఎంకు బాలినేని వివరిస్తున్నట్టు సమాచారం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని