Revanthreddy: కాంగ్రెస్లోకి చేరికల తుపాన్ రాబోతోంది: రేవంత్రెడ్డి
పోడుభూముల సమస్యను పరిష్కరిస్తామన్న కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పోడు భూముల్లో
హైదరాబాద్: పోడుభూముల సమస్యను పరిష్కరిస్తామన్న కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పోడు భూముల్లో దుక్కి దున్ని సాగు చేసుకుంటున్నవారిని పోలీసులు అరెస్టు చేసి హింసించారన్నారు. తెరాస ప్రభుత్వం ఆదివాసీలను చిన్నచూపు చూస్తోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ సభ్యుడు కాంతారావు తదితరులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. 11 నెలల్లో ఎన్నికలు వస్తాయని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో 10 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందన్నారు.
‘‘హరితహారం పేరుతో దాడులు చేస్తున్నారు. గిరిజనుల భూములు లాక్కుని లే అవుట్లు వేస్తున్నారు. తాటి వెంకటేశ్వర్లు, కాంతారావుల చేరికతో కాంగ్రెస్ మరింత బలపడుతుంది. రైతు డిక్లరేషన్ అమలైతే .. రైతుల జీవితాలే మారిపోతాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలి... పేదల ప్రభుత్వం రావాలి. త్వరలోనే అశ్వరావుపేటలో భారీ బహిరంగసభ నిర్వహిస్తాం. త్వరలో కాంగ్రెస్లో చేరికల తుపాన్ రాబోతోంది’’ అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... రుణమాఫీ హామీని గాలికొదిలేశారు. కొత్త రేషన్ కార్డు ఒక్కటి కూడా ఇవ్వలేదు. హైదరాబాద్లో ఫ్లై ఓవర్లు నిర్మిస్తే సరిపోతుందా? ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరణి వల్ల ప్రతి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే గిరిజనులకు న్యాయం జరుగుతుంది. పినపాక ఎమ్మెల్యేకు భూ కబ్జా, ఇసుక మాఫియాపై ఉన్న ఆసక్తి ప్రజా సమస్యలపై లేదు’’ అని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని